Don't Miss!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
కంటెంట్, కాస్టింగ్ రెండూ మైనస్లే: దిల్ రాజు
ఇంకా ఆయన చెబుతూ- "రెండు గంటల 20 నిమిషాల నిడివి ఉన్నా.. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుందీ సినిమా. టెక్నీషియన్స్ కూడా అందరూ ఉద్దండులే. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎపిసోడ్స్ ఇందులో చాలా ఉంటాయి. హీరోహీరోయిన్ల నేపథ్యాలు కూడా కొత్తగా ఉంటాయి. అందుకే ఈ ఏడాదిలో ఇప్పటివరకు వచ్చిన ఎనిమిది హిట్ల తర్వాత వస్తున్న తొమ్మిదో హిట్ ఈ సినిమా అని మీడియా సాక్షిగా చెప్పేశాను. ఈ సినిమాపై నాకున్న నమ్మకం అలాంటిది'' అన్నారు దిల్ రాజు.
"అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా పూర్తయిన తరవాత ఎందుకో ఆ సినిమాపై నాకే కొన్ని సందేహాలు వచ్చాయి. వెంటనే ఎమ్మెస్ రాజుకి చూపించాం. ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు. దాంతో.. సినిమా బాగా వచ్చింది. 'తూనీగ తూనీగ'కూ అలాంటి సమస్యే ఎదురైంది. నాకు ఈ సినిమా చూపించినప్పుడు ఫస్టాఫ్ సూపర్ అనిపించింది. క్లైమాక్స్ గొప్పగా ఉంది. ఈ మధ్యలోనే కాస్త లోటు అనిపించింది. ఆ సంగతే చెబితే, మళ్లీ ఓ వారం షూటింగ్ చేసి చూపించారు. అల్టిమేట్ రిజల్ట్ వచ్చింది" అన్నారు.
"అలాగే సుమంత్ అశ్విన్ అనుభవం ఉన్న హీరోలా చాలా ఈజ్తో చేశాడు. వెంకటేశ్, అల్లు అర్జున్ తర్వాత ఓ నిర్మాత కొడుకుగా సుమంత్ అశ్విన్ హీరోగా సెటిల్ అవుతాడు. నేను చెప్పింది నిజమని సినిమా విడుదలైన రోజు ప్రేక్షకులు ఏకీభవిస్తారు. ఇప్పటికే పాటలు సూపర్ హిట్టయ్యాయి. కొడుకును పరిచయం చేస్తున్నారు కాబట్టి ఎమ్మెస్ రాజు రెట్టింపు కష్టపడ్డారు. ఈ సినిమా విడుదలయ్యాక మా బేనర్లోనే అశ్విన్తో రెండో సినిమా చేస్తాం'' అని చెప్పారు అన్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, కెమెరా: ఎస్.గోపాల్రెడ్డి, కథ, స్క్రీన్ప్లే,దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.