Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
20 ఏళ్లు పూర్తి చేసుకున్న దిల్ రాజు బేనర్, ఇకపై సరికొత్త స్ట్రాటజీ!
తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్కు, ఆ సంస్థ అధినేత దిల్ రాజుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించడంతో పాటు డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సంస్థ టాలీవుడ్లో అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటిగా వెలుగొందుతోంది. తమ సంస్థ విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దిల్ రాజు మీడియాతో మీట్ అయ్యారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ... సినిమా డిస్ట్రిబ్యూషన్ ద్వారా మా బ్యానర్ ప్రస్థానం 1999లో ఒకే ఒక్కడు మూవీతో మొదలైంది, దానికి ముందు జూలై 24న తొలిప్రేమ చిత్రాన్ని పార్ట్నర్ షిప్లో రిలీజ్ చేశాం. పవన్ కళ్యాణ్గారిని పెద్ద స్టార్గా నిలబెట్టిన సినిమా అది. 'పెళ్లి పందిరి' చిత్రం నిర్మాతగా రాణించడానికి తోడ్పడిందని తెలిపారు. ఆ సినిమా తర్వాత డిస్ట్రిబ్యూషన్ నుండి ప్రొడక్షన్లోకి ఎంటరయినట్లు తెలిపారు.
తమ సంస్థ నిర్మాణం మొదలు పెట్టి 16 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు 32 సినిమాలు పూర్తి చేశాం. ఇది మాకు ఒక గొప్ప జర్నీ, ఈ కాలంలో రకరకాల పరిస్థితులు చూశాం, ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. సినిమా విజయం వెనక స్క్రిప్ట్ మొదలు పెట్టినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు చాలా విషయాలు ఉంటాయని దిల్ రాజు తెలిపారు.
2017లో మా సంస్థలో అత్యధికంగా 6 సినిమాలు చేశాం. 2018లో 3 సినిమాలు, 2019లో 4 సినిమాలు విడుదల కాబోతున్నాయి. కేవలం మాకు మేముగా సినిమాలు నిర్మించడమే కాకుండా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న కొత్త నిర్మాతలకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం. మా బేనర్లో అసోసియేట్ అవ్వడం ద్వారా స్క్రిప్ట్ దగ్గర నుండి రిలీజ్ వరకు సపోర్ట్ చేసి ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించేలా మావంతు కృషి చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్ రాజు తెలిపారు.