Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ రెండు సినిమాలూ కలిస్తే...‘సీతమ్మ వాకిట్లో...’
హైదరాబాద్ : మహేష్బాబుతో కలిసి వెంకటేష్ నటించిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. సమంత హీరోయిన్. అంజలి, ప్రకాష్రాజ్, జయసుధ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. దిల్రాజు నిర్మాత. మిక్కీ జె.మేయర్ స్వరాలు సమకూర్చారు. ఆదివారం హైదరాబాద్లో ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. దాంతో ఈ చిత్రం ఎలా ఉంటుంది...ఎలా ఉండబోతోంది అనే విషయాలు ఫ్యాన్స్ లో కాక అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ విషయమై దిల్ రాజు ఆడియో వేదికపై సినిమా ఎలా ఉంటుందో క్లూ ఇచ్చారు.
దిల్రాజు మాటల్లోనే '' కలిసుందాం రా, మురారి కలిస్తే ఎలా ఉంటుందో 'సీతమ్మ వాకిట్లో...' సినిమా అలా ఉంటుంది, ''అన్నారు. కలిసుందాం రా చిత్రం వెంకటేష్ కెరిర్ లోనే సూపర్ హిట్ చిత్రం. వెంకటేష్, సిమ్రాన్ కాంబినేషన్ లో రూపొందిన ఆ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉదయ్ శంకర్ ఆ చిత్రాన్ని రూపొందించారు. కుటుంబ గౌరవాలు, పెద్దరికం, విలువలు వంటి అంశాలను టచ్ చేస్తూ ఆ చిత్రం సాగుతుంది. ముఖ్యంగా చిత్రంలో తాత,మనువడుల మధ్య సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. అలాగే బావా,మరదళ్ల సరదాలు ఈ చిత్ర మరో సారి గుర్తు చేసింది.
ఇక మురారి విషయానికి వస్తే..మహేష్ కెరీర్ లోనే సూపర్ హిట్ చిత్రం ఇది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాలి బింద్రే హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం కూడా ఉమ్మడికుటుంబం, విడిపోయిన రెండు కుటుంబాలను కలిపే హీరో, పుట్టింటివారి ప్రేమలు, బావ,మరదళ్ల సరదాలు వంటి విషయాలు చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా చిత్రంలో బామ్మకి,హీరోకి మధ్య రిలేషన్ హైలెట్ గా నిలుస్తుంది. భాంధవ్యాలను మరోసారి గుర్తు చేసి ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయిందీ చిత్రం.
మరి ఇలాంటి రెండు చిత్రాలుకలిపితే ఎలా ఉంటుందో ..అలాంటి చిత్రం తీస్తే తప్పకుండా జనం ఆదరిస్తారనేది నిజం. అలాగే దిల్ రాజు మాట్లాడుతూ...మా సంస్థ సినిమాలు తీయడం ప్రారంభించి పది సంవత్సరాలైంది. పదోయేట ఒక మల్టీస్టారర్ సినిమా తీయడం నా అదృష్టం. 'దూకుడు' సెట్లో మహేష్బాబుకి కథ చెప్పాం. వీళ్లిద్దరూ సినిమాలో నిజమైన అన్నదమ్ముల్లా ప్రవర్తించారు. సినిమాపై ప్రేమతో నటించారు అన్నారు.