Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘వాడే’ రామ్ చరణ్ కోసం సమంతను అరెస్ట్ చేసిన దిల్ రాజు..!
ఏమాయ చేసావె సినిమా విడుదలైన తర్వాత సమంతని గుర్తించిన వారిలో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. మిగతా హీరోలలానే అతను కూడా ఆమెని తన సినిమాలో తీసుకోవాలని అనుకున్నాడు. కానీ ముందే ఆమె కోసం క్యూ కట్టిన వారికి కమిట్ అయి ఉండడంతో చరణ్ తో సమంత నటించడం ఇంతవరకు కుదర్లేదు. రచ్చ సినిమాకి ఆమెని కథానాయికగా తీసుకోవాలని చాలా ట్రై చేసి, కుదరకపోవడంతో తమన్నాతో చేస్తున్నాడు. రీసెంట్ గా కూడా మరో సినిమా కోసం సమంత డేట్స్ కోసం ప్రయత్నిస్తే చరణ్ కి చుక్కెదురైంది.
కాగా బ్లాక్ బస్టర్ మూవీ 'దూకుడు"తో మరింత క్రేజ్ పెంచుకొన్న సమంతకి వెల్లువలా ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి. ఇటు టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా ఆమెకు డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పట్లో ప్రతి నిర్మాత, ప్రతి హీరో కూడా ఆమెతో ఒక్క సినిమా తీయాలనే పట్టు పడుతున్నారు. దాంతో విరామంలేకుండా ఆమె న్యూ ప్రొజెక్ట్ లను ఒప్పుకుంటోంది. రీసెంట్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి మహేష్ సరసన రెండో సారి నటించడానికి అగ్రీమెంట్ ఓకే చేసిందని సమాచారం.
అయితే ఆమెతో నటించాలనే చరణ్ కోరికను దిల్ రాజు తీర్చబోతున్నాడు. చరణ్ హీరోగా పైడిపల్లి వంశీ దర్శకత్వంలో నిర్మించే చిత్రంలో సమంతని దిల్ రాజు కథానాయికగా ఎంపిక చేశాడు. ఈ చిత్రం ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నా కానీ ఇప్పుడే ఆమె డేట్స్ అరెస్ట్ (బందీ) చేసి పెట్టాడు. ఈ చిత్రానికి 'వాడే"అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.