Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆ సినిమాతో 'దిల్ రాజు'కి నాగిరెడ్డి పురస్కారం
విజయ సంస్థలో ఒకరైన నాగిరెడ్డి శతజయంతి సంవత్సరమిది. ఈ సందర్భంగా విజయ మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నాగిరెడ్డి పేరిట ప్రతియేటా ఓ పురస్కారాన్ని ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ యేడాది ఆ పురస్కారానికి 'మిస్టర్ పర్ఫెక్ట్' చిత్రం ఎంపికైంది.ఈ నెల 22న జరిగే ఓ కార్యక్రమంలో నిర్మాత దిల్రాజుకు ఈ పురస్కారం కింద రూ.1.5 లక్షలు నగదు బహుమతితోపాటు, జ్ఞాపికను అందజేస్తారు. ఈ విషయాన్ని నాగిరెడ్డి తనయుడు బి.వెంకట్రామిరెడ్డి ఆదివారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ''మా నాన్నగారి ఆలోచనలకు అనుగుణంగా ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశాం. సందేశం, వినోదం, వాణిజ్యాంశాల మేళవింపుతో ఇంటిల్లిపాదినీ అలరించిన ఓ చిత్రాన్ని ఎంపిక చేసి ఆ నిర్మాతకు నాగిరెడ్డి పురస్కారం అందిస్తాం. ఈ యేడాది 'మిస్టర్ పర్ఫెక్ట్' చిత్రం ఎంపికైంది. ఈ నెల 22న జరిగే ఓ కార్యక్రమంలో నిర్మాత దిల్రాజుకు ఈ పురస్కారం కింద రూ.1.5 లక్షలు నగదు బహుమతితోపాటు, జ్ఞాపికను అందజేస్తాం. యేటా జరిగే ఈ అవార్డుల ఎంపికకు సింగీతం శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశాం. తెలుగుతోపాటు, తమిళంలోనూ ఓ చిత్రానికి ఈ పురస్కారం అందిస్తాం. ప్రస్తుతం తమిళ చిత్రం ఎంపిక జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, సి.నారాయణరెడ్డి, నందమూరి బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్ తదితరులు హాజరవుతారు.