Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
పదిహేను నిమిషాలు మాత్రమే మహేష్... : దిల్ రాజు
హైదరాబాద్ : చాలా కాలం తర్వాత వస్తున్న మల్టీస్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. వెంకటేష్, మహేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ... కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే మహేష్ కథ విని 'ఓకే' చెప్పేశారు. ఈ కథలో ఉన్న గొప్పతనం అలాంటిది. అభిమానులనే కాదు... అన్ని వయసుల వారినీ అలరించే రీతిలో వెంకటేష్, మహేష్ల పాత్రలు సాగుతాయి అన్నారు.
అలాగే... సీతమ్మ వాకిలి అంత పవిత్రమైన మనదేశంలో సిరిమల్లె చెట్టు లాంటి ఓ అందమైన కుటుంబం. అనుబంధాలకు నెలవైన ఆ ఇంట్లో జరిగిన అనూహ్య పరిణామాలే ఈ సినిమా. ఈ కథ విన్నవెంటనే చేయడానికి అంగీకారం తెలిపారు వెంకటేష్. ఈ నెల 27న తాజా షెడ్యూల్ మొదలైంది. నవంబర్ 15 వరకు సాగే ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. డిసెంబర్ 21న సినిమాను విడుదల చేస్తాం'' అని తెలిపారు.
వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్గా ఫోకస్ కానుంది. ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''భారతదేశం ఓ సీతమ్మ వాకిలి. అందులో సిరిమల్లె చెట్టు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. అందులోని మమతానురాగాలను మా సినిమాలో చూపిస్తున్నాం. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇది. మిక్కీ.జె.మేయర్ సంగీతం ఆహ్లాదకరంగా సాగిపోతుంది'' అని చెప్పారు.
25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీస్టారర్ ఇది. వెంకీ, మహేష్ అన్నదమ్ము లుగా నటిస్తున్నారు. సీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు..అంటే కుటుంబం. సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, రోహిణి హట్టంగడి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: కె.వి.గుహన్, కళ: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: శ్రీకాంత్