మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు నెక్ట్స్ మూడు ప్రాజెక్టుల డిటేల్స్
ప్రేక్షకుల పల్స్ పట్టుకుని వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న దిల్ రాజు తాజా చిత్రం మిస్టర్ ఫెరఫెక్ట్ రేపు(శుక్రవారం) విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన మరో మూడు స్క్రిప్టులు రెడీ చేయించారు. వాటిల్లో ఒకటి సిద్దార్ధ, శృతిహాసన్, హన్సిక కాంబినేషన్ లో వేణు శ్రీరామ్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందే ఓ మై ప్రెండ్ చిత్రం. ఈ చిత్రం ఆల్రెడీ సెట్స్ పై ఉంది. ఇక ఆ తర్వాత తన బ్యానర్ లో కొత్త బంగారులోకం చిత్రంతో విజయం అందించిన శ్రీకాంత్ అడ్డాల చిత్రం ఒకటి.అయితే ఈ చిత్రానికి ఇద్దరు హీరోలు అవసరమవుతారు. కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు పవన్, వెంకటేష్ కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే టైటిల్ తో ఈ చిత్రం అనుకున్నారు.అది కూడా త్వరలోనే సెట్స్ కు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటి తర్వాత మిస్టర్ ఫెరపెక్ట్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన హరి దర్శకత్వంలో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఆ చిత్రం కూడా త్వరలోనే మొదలు కానుందని సమాచారం.


Click it and Unblock the Notifications











