మణి రత్నం మూవీ దిల్ రాజు సమర్పణలో...

By Bojja Kumar

హైదరాబాద్: విలక్షణ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో ‘ఓకే కన్మణి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మమ్ముట్టి తనయుడు దుల్కేర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది.

ఈ చిత్రాన్ని ‘ఒకే బంగారం' పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతల్ని నిర్వహిస్తుండగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. మణిరత్నం హిట్టు రుచి చూసి చాలా కాలమైంది. ఈ చిత్రంపై ఆయన చాలా ఆశలే పెట్టుకున్నాడు.

Dil Raju to present Mani Ratnam’s next

తొలుత తెలుగులో ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేశారు మణిరత్నం. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. కానీ సినిమాలోని పాత్ర తనకు అంతగా సరిపోదని రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని తిరస్కరించారు. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దిల్ రాజు సమర్పణలోనే ఈ సినిమా తెలుగులో విడుదలవుతోందని టాక్. దిల్ రాజు సినిమా రైట్స్ తీసుకున్నారంటే మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం సర్వత్రా వ్యక్తమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X