Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దిల్ రాజు పక్కా ప్లానింగ్.. మూడు నెలల్లో మూడు సినిమాలు!
నిర్మాత దిల్ రాజు తాజాగా మహేష్ బాబు తో వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెలనుండి సెట్స్ మీదకు వెళుతోంది. దేవి సంగీతం అందించబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హీరో అల్లరి నరేష్ ఈ సినిమాలో మఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.
నిర్మాత దిల్ రాజు వచ్చే నెల నుండి వరుసగా మూడు నెలల్లో మూడు సినిమాలను విడుదల చెయ్యబోతున్నాడు. మొదటగా రాజ్ తరుణ్ నటించిన లవర్. అనిష్ కృష్ణ దర్శకత్వం వహించిన లవర్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమా ను జూలై లో విడుదల చెయ్యాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం.
హీరో రాజ్ తరుణ్ సినిమా తరువాత శతమానం భవతి మూవీ ద్వారా హిట్ అందుకున్న డైరెక్టర్ సతీష్ విఘ్నేష్ నితిన్ శ్రీనివాస కళ్యాణం మూవీకి దర్శకుడు. శ్రీనివాస కళ్యాణం పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఆగుస్ట్ లో విడుదల చెయ్యాలనే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్లు సమాచారం.
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్ హీరోగా 'హలో గురు ప్రేమకోసమే' చిత్రం రూపొందింది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చెయ్యడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడు. జూలై, ఆగుస్ట్, సెప్టెంబర్ మూడు నెలల్లో మూడు సినిమాలు విడుదల చెయ్యబోతున్నాడు దిల్ రాజు.