Don't Miss!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
రాక్షసి ఔట్, వెంకీ కూతురికి దిల్ రాజు ఆఫర్
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆ మధ్య ‘కేరింత' పేరుతో ఓ స్మాల్ బడ్జెట్ మూవీని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్-లావణ్య త్రిపాఠి(అందాల రాక్షసి ఫేం) హీరో హీరోయిన్లుగా ఈ సినిమా మొదలు పెట్టి 25 రోజుల షూటింగ్ అనంతరం నిలిపి వేసారు. ఔట్ పుట్ సరిగా లేదని, స్క్రిప్టులో మార్పులు మొదలెట్టారు.
స్క్రిప్టు విషయంలో మాత్రమే కాదు...హీరోయిన్ లావణ్య తిపాఠి పనితీరు విషయంలో కూడా దిల్ రాజు సంతృప్తిగా లేరట. దీంతో ఆమెను తప్పించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో కృతిక ను తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల వచ్చిన ‘దృశ్యం' చిత్రంలో కృతిక వెంకటేష్ కూతురుగా నటించింది. దీంతో పాటు ఆమె ఇటీవల ప్రారంభమైన ‘వినవయ్యా రామయ్యా' చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు కేరింత చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కి జే మేయర్ను పని చేయనున్నారు. రాల్రాజు మాట్లాడుతూ ''కుర్రకారు మనోభావాల్ని ఆవిష్కరించే కథ ఇది. సాయికిరణ్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. రచయిత అబ్బూరి రవితో కలిసి ఆ కథని మరింత బాగా తీర్చిదిద్దామని దిల్ రాజు కొన్ని నెలల క్రితం సినిమా ప్రారంభం సందర్బంగా చెప్పుకొచ్చారు.
''ఇదివరకు మా సంస్థలో చిన్న సినిమాల్ని తెరకెక్కించాం. కొంతకాలంగా స్టార్ హీరోల చిత్రాలకే పరిమితమయ్యాం. ఐదేళ్ల తర్వాత మళ్లీ 'కేరింత' పేరుతో ఓ చిన్న చిత్రాన్ని మొదలుపెడుతున్నాం'' అన్నారు దిల్రాజు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం: విశ్వ, కూర్పు: మధు, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్.