Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
జూ ఎన్టీఆర్ మోడ్రన్ శ్రీకృష్ణుడు...దిల్ రాజు
మోడరన్ శ్రీకృష్ణుడిలా కనిపిస్తాడు ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ చేసిన అన్ని సినిమాల్లో ఇది వైవిధ్యంగా ఉంటుంది. ప్రేక్షకులకి థ్రిల్ కలిగిస్తుంది అంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. అలాగే ఈ ఏడాది టాప్ 3 సినిమాల్లో 'బృందావనం' ఒకటిగా నిలుస్తుందనీ, ఇది అతి విశ్వాసంతో చెబుతున్న మాట కాదనీ, సినిమా చూసుకున్నాకే గట్టి నమ్మకంతో చెబుతున్న మాట అనీ ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హీరోగా; కాజల్ అగర్వాల్, సమంతా హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు నిర్మిస్తున్న 'బృందావనం' చిత్రం షూటింగ్ చివరి పాట చిత్రీకరణలో ఉంది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "ప్రస్తుతం స్విట్జర్లాండులో చివరి పాటని చిత్రీకరిస్తున్నాం. 10తో షూటింగంతా అయిపోతుంది. 12న పాటల్నీ, అక్టోబర్ 1న సినిమానీ విడుదల చేయబోతున్నాం. 'మున్నా' ఫేమ్ వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. 'మున్నా'ని డైరెక్ట్ చేసిన వంశీకి ఈ సినిమా ఒక అచీవ్మెంట్ అవుతుంది. అతను అద్భుతంగా కథ తయారుచేసుకుని, ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. టెక్నికల్గా అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమా తయారవుతోంది. కాజల్, సమంతా పాత్రలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. 36 మంది ఆర్టిస్టులతో చేసిన ఈ సినిమా ఒక షడ్రుచుల భోజనంలా ఉంటుంది" అని రాజు చెప్పారు.ధమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామ్-లక్ష్మణ్, పీటర్ హెయిన్స్, కళ: ఆనందసాయి, సహ నిర్మాతలు: శిరీశ్, లక్ష్మణ్.