Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Akhanda టీంకు దిల్ రాజు పార్టీ.. జాక్ పాట్ కొట్టడంతో సర్ప్రైజ్ పార్టీ.. ఎంత లాభం వచ్చిందో తెలుసా?
నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కి చాలా దగ్గరగా వచ్చిన ఈ సినిమా దిల్ రాజుకు లాభాలను గట్టిగా తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో బాలకృష్ణ సహా యూనిట్ కు పార్టీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
అఖండ మాస్ జాతర
నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్టయింది. గత రెండేళ్లుగా ఢిలా పడ్డ థియేటర్లకు సరికొత్త జోష్ తీసుకొచ్చింది ఈ సినిమా. బాలకృష్ణ నటనకు.. బోయపాటి మాస్ డైరెక్షన్, సహా థమన్ అదిరే బీజేఎం దెబ్బకు ప్రేక్షకులు థియేటర్ల వైపు క్యూ కడుతున్నారు. . తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఇతర దేశాల్లోనూ అఖండ మాస్ జాతర కొనసాగుతుంది.
హౌస్ ఫుల్ బోర్డులు
ఇక ఈ అఖండ సినిమాలో బాలయ్య సరనస ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. శ్రీకాంత్ విలన్ పాత్రలో అదరగొట్టాడు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోంది. వీకెండ్ లో అద్దిరిపోయే వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం సోమవారం కూడా చాలా గట్టిగా నిలబడింది. సోమవారం కూడా చాలా వరకు అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇచ్చాయి.
ఐదు రోజులకు కలిపి
అఖండ' మూవీకి ఐదు రోజులకు కలిపి భారీ వసూళ్లు వచ్చాయి. ఐదు రోజులకు నైజాంలో రూ. 13.42 కోట్లు, సీడెడ్లో రూ. 10.72 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.12 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.82 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.22 కోట్లు, గుంటూరులో రూ. 3.50 కోట్లు, కృష్ణాలో రూ. 2.51 కోట్లు, నెల్లూరులో రూ. 1.83 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 41.14 కోట్లు షేర్, ఐదు రోజులకు మొత్తం రూ. 64.80 కోట్లు గ్రాస్ వచ్చింది.
నాలుగు రోజుల్లో
అయితే మిగతా ప్రాంతాల్లో కంటే నైజాంలో ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అఖండ నైజాం థియేట్రికల్ హక్కులను రూ.10.5 కోట్లు చెల్లించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. అయితే విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 12 కోట్ల రూపాయల షేర్ను, రూ.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో తొలి వారాంతంలోనే దిల్ రాజ్కు సుమారు రూ.1.5 కోట్ల లాభాన్ని తెచ్చి పెట్టినట్టు అయింది.
గ్రాండ్ పార్టీ
నిజానికి అఖండ నైజాం, ఉత్తరాంధ్ర థియేట్రికల్ హక్కులు పదిహేడు కోట్ల రూపాయలకు ఆయన దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు నైజాం ఒక్కచోటే ఆ 17 కోట్లు, వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో అఖండ బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన క్రమంలో దిల్ రాజు నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. దిల్ రాజు తన కొత్త నివాసంలో ఈ పార్టీ ఇచ్చారు.
బాలయ్య ఫుల్ జోష్లో
ఈ పార్టీకి దిల్ రాజు దర్శకుల బృందం హాజరయ్యారు. బాలకృష్ణ, బోయపాటిలను సర్ ప్రైజ్ హౌస్ పార్టీకి పిలిచాడు. బాలయ్య ఫుల్ జోష్లో ఉన్నారని, పార్టీలో ఆయన బాగా ఎంజాయ్ చేశారని అంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దిల్ రాజు తన 50వ పుట్టినరోజును అఖండ టీమ్ మరియు అతని సన్నిహితులతో జరుపుకున్నారు.