Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాష్ట్ర విభజనతో సమస్య లేదంటున్న దిల్ రాజు
హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్ ఏమిటనే విషయమై ఆసక్తికర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. విడిపోయాక పరిశ్రమ హైదరాబాద్ నుండి తరలివెలుతుందనే వదంతులూ వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొట్టి పారేసారు.
రాష్ట్రం విడిపోయినా...తెలుగు సినిమా పరిశ్రమకు ఎలాంటి ఇబ్బంది లేదని, రాష్ట్రాలు రెండైనా తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కటిగానే ఉంటుందిన ఆయన స్పష్టం చేసారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. రాష్ట్రం విడిపోయినా తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని స్వామివారిని కోరుకున్నానని రాజు చెప్పారు.
తన తర్వాతి సినిమా ప్రాజెక్టుల గురించి వివరిస్తూ.... కొత్త వారితో 'కేరింత' అనే సినిమా చేస్తున్నానని తెలిపారు. అంతేగాకుండా 'లవర్', 'కలిసి ఉంటే కలదు సుఖం' చిత్రాలకు ప్లాన్ చేసినట్లు దిల్ రాజు తెలిపారు. 'కేరింత' చిత్రానికి సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహించబోతున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మై డ్రీం సినిమా బ్యానర్ ఫై దిల్ రాజు, సాయి కిరణ్ అడవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం త్వరలో మొదలు కానుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కి జే మేయర్ ను ఎంపిక అయ్యారు. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కొత్తవాళ్లు నటిస్తారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విశ్వ, కూర్పు: మధు, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్.స