వారసుడు సినిమా ట్రైలర్ పై ట్రోల్స్.. దిల్ రాజు షాకింగ్ రియాక్షన్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన వారిసు/వారసుడు సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల కాబోతోంది అని ఇన్ని రోజులు దిల్ రాజు చెప్పుకుంటూ వచ్చారు. తప్పకుండా రెండు భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఎంతో నమ్మకంతో కనిపించారు. ఇక తమిళంలో భారీ స్థాయిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించగా అక్కడ దిల్ రాజు స్పీచ్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
అయితే వారసుడు సినిమాను జనవరి 11వ తేదీన విడుదల చేయాలని ముందుగానే అనుకున్న విషయం తెలిసిందే. ఇక అదే రోజు తెలుగులో కూడా వస్తుందని అనుకుంటే ఇప్పుడు మాత్రం నిర్మాత దిల్ రాజు ఊహించిన విధంగా ట్విస్ట్ ఇచ్చారు. తెలుగులో రెండు భారీ చిత్రాలు విడుదలవుతున్న తరుణంలో తీవ్రమైన పోటీ నెలకొంటుంది అని థియేటర్ల విషయంలో కూడా ఊహించని విధంగా ఫైట్ ఉంటుంది అని ఇండస్ట్రీలో ముందుగానే ఒక టాక్ అయితే వినిపించింది.

అయితే మొత్తానికి నిర్మాత దిల్ రాజు మొదట వారిసు సినిమాను తమిళంలో జనవరి 11వ తేదీన విడుదల చేసి మళ్ళీ తర్వాత జనవరి 14వ తేదీన సంక్రాంతి రోజు వారసుడు సినిమాను తెలుగులో విడుదల చేయాలి అని ఫిక్స్ అయ్యారు. తప్పకుండా సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందని చెప్పారు. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత.. మహర్షి అలాగే అల వైకుంఠపురములో బృందావనం అజ్ఞాతవాసి సినిమాల తరహాలో ఉంటుంది అని అనిపిస్తున్నట్లుగా కొందరు ట్రోలింగ్ అయితే చేశారు.
ఇక ఆ విషయంపై నిర్మాత దిల్ రాజు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. "ఆ సీన్ ఈ సినిమా లో ఉంది
ఈ సీన్ ఆ సినిమా లో ఉంది కాదురా నాయినా..
టోటల్ గా సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి.
అప్పుడు నేను తీసుకోడానికి రెడీ గా ఉంటా" అని దిల్ రాజు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తప్పకుండా సినిమా అయితే అందరికీ నచ్చుతుంది అనే కాన్ఫిడెన్స్ తోనే మొదటి నుంచి కూడా ఉన్నాము అని ఈ సినిమా విడుదలైన తర్వాత పూర్తిస్థాయిలో అందరికీ సమాధానం చెబుతుంది అని కూడా దిల్ రాజు నమ్మకం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











