Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫిల్మ్ మేకర్ బాలు మహేంద్ర కన్నుమూత
హైదరాబాద్: దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్గా, రచయితగా, నిర్మాతగా, ఎడిటర్గా భారతీయ సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన ఫిల్మ్ మేకర్ బాలు మహేంద్ర ఇక లేరు. గురువారం ఉదయం ఆయన గుండెపోటుతో మరణించారు. ఈ రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను చెన్నైలోని విజయ్ ఆసుత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.
తమిళం, హిందీ, మళయాలం, కన్నడ, తెలుగు బాషల్లో ఆయన పలు అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. తెలుగులో ఆయన 'నిరీక్షణ', కమల్ హాసన్-శ్రీదేవి జంటగా నటించిన 'వసంత కోకిల' చిత్రాలను తెరకెక్కించారు. వసంత కోకిల చిత్రం హిందీలో సద్మా పేరుతో వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు, పలు రాష్ట్ర ప్రభుత్వాల నుండి బాలు మహేంద్ర అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. బాలు మహేంద్ర మరణ వార్త సినీ ప్రేమికులను కలిచి వేసింది.
1939లో శ్రీలంకలోని తమిళ ఫ్యామిలీలో జన్మించిన బాలు మహేంద్ర అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసారు. 13 ఏళ్ల వయసులో డేవిడ్ లీన్ దర్శకత్వంలో వచ్చిన 'ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్' చిత్రం చూసే అవకాశం దక్కించుకున్న బాలు మహేంద్ర తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు.
లండన్ యూనివర్శిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ హానర్స్ డిగ్రీ పట్టా పొందిన అనంతరం పూణెలోని ఎఫ్టిఐఐలో జాయినై సినిమాటోగ్రఫీలో కోర్సు పూర్తి చేయడంతో పాటు గోల్డ్ మెడల్ సాధించారు. అనంతరం సినిమాటోగ్రాఫర్గా, దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా తన ప్రయాణాన్ని సక్సెస్ ఫుల్గా కొనసాగించారు బాలు మహేంద్ర.