Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
40ప్లస్ బ్యాచిలర్ కథ: దశరథ్
దశరథ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'గ్రీకువీరుడు'. నాగార్జున-నయనతార జంటగా నటించారు. కామాక్షి మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్రెడ్డి నిర్మించారు. ఈ శుక్రవారం(మే 3న) ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
అలాగే నా నిజజీవితంలో ఏ అమ్మాయి వెంటా పడలేదు. ఇవేవీ నా స్వీయానుభవాలు కాదు..అని దశరథ్ చెప్పుకొచ్చారు. ''నాగ్తో నా సినిమా అనగానే ప్రేక్షకులు సంతోషం..లాంటి ఓ కుటుంబ సినిమా కావాలనుకుంటారు. అందుకు తగ్గట్టే ఫ్యామిలీ ఎంటర్టైనర్ని తీర్చిదిద్దాం అన్నారు.
'గ్రీకువీరుడు' లో నాగ్ పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. నయన్ నటన హైలైట్. నాగ్ ఈవెంట్ మేనేజర్గా నటిస్తారు. అయితే ఆ పాత్రకి టైటిల్కి సింక్ కంటే..నాగ్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకునే ఈ టైటిల్ పెట్టాం. ఇది రొమాంటిక్ కామెడీ కాదు. ప్రేమకథా చిత్రం కాదు. ప్రేమ, సెంటిమెంట్, కామెడీ, అనుబంధాలు అన్ని అంశాల మేలు కలయికతో తీర్చిదిద్దిన నవతరం చిత్రం. ఓ సమస్యని సందేశాత్మకంగా చెబుతూనే వినోదాన్ని అందించే ప్రయత్నం చేశాం'' అన్నారు. తమిళ్లో 'లవ్స్టోరి' పేరుతో ఇదే రోజున విడుదలవుతోందని తెలిపారు.