Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అబ్బబ్బే..నేను ఎన్టీఆర్ ని అసలు ఏమీ అనలేదు..డైరక్టర్ వివరణ
ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని తమిళ దర్సకుడు హరి అన్నారంటూ వచ్చిన వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు.
హైదరాబాద్ : గత నాలుగు రోజుల నుంచి ఎన్టీఆర్ అభిమానులు ... దర్శకుడు హరి విషయంలో మండిపడుతున్నారు. అందుకు కారణం మీడియాలో వచ్చిన వార్తలు. ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని హరి అన్నారని ఆ వార్తల సారాంశం. అయితే అందులో ఎంత వరకూ నిజముందే ఎవరూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. హరి నిజంగా అలా అని ఉంటే...ఆ వీడియో వైరల్ అయ్యేది కదా అని ఆలోచించలేదు.ఇక ఈ విషయం దర్శకుడు హరి కి తెలిసింది.
హరి మీడియాతో మాట్లాడుతూ... "నా మీద ఓ రూమర్ రీసెంట్ గా విన్నాను. నేను ఎన్టీఆర్ ఎవరో తెలియదు అన్నానని. అయితే నిజం ఏమిటంటే అసలు నేను ఎక్కడా ఆ మాట అనలేదు. ఎన్టీఆర్ ఫెరఫార్మెన్స్ నాకు నచ్చుతుంది. నేను టెంపర్ సినిమాని రెండు సార్లు చూసాను.
అలాగే...నేను ఎన్టీఆర్ తో పని చేయాలని చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను చాలా కాలం క్రితం ఎన్టీఆర్ కు కథ చెప్పటం జరిగింది. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. త్వరలోనే ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని ఆశిస్తున్నాను అని ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు.
'సింగం'(యముడు), 'సింగం 2′(సింగం - యముడు 2). తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ సిరీస్లో మూడో సినిమాయే 'సింగం 3'. తెలుగులో యముడు 3 పేరుతో వస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 16న భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక టీజర్, పోస్టర్స్తో ఇప్పటికే అంచనాలను అమాంతం పెంచేసిన ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా రికార్డులు సృష్టిస్తూ వెళుతోంది.
'సింగం 3' తమిళనాడు ఏరియా బిజినెస్ మొత్తం 42 కోట్ల రూపాయలు పలికిందట. సూర్య కెరీర్కు బిజినెస్ పరంగా అక్కడ ఇది అతిపెద్ద రికార్డు. ఇక ఒక్క తమిళనాడులోనే కాక, రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఓవర్సీస్.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే స్థాయిలో బిజినెస్ జరుగుతూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్లు హీరోయిన్లుగా నటించారు.