Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కోలుకుంటున్న కోడి రామకృష్ణ
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ స్వల్ప అస్వస్థత కారణంగా ఇటీవల చెన్నయ్లోని విజయ ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్తో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఆయన కుటుంబీకులతో మీడియాతో మాట్లాడినప్పుడు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని, రెండుమూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని తెలిపారు.
సినిమా షూటింగ్స్లో నిరవధికంగా పాల్గొనడం వలన ఆయన కొంత అస్వస్థతకు గురయ్యారని కోడి రామకృష్ణ వ్యక్తిగత సహాయకుడు రాజు తెలిపారు. ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఆయన త్వరలో సినిమా షూటింగ్లో పాల్గొంటారని రాజు చెప్పారు. కోడి రామకృష్ణ కూడా ఫోనులో మీడియాతో మాట్లాడారు. అర్జున్ తో కొత్త సినిమా ప్రారంభం రోజున ఆయన ఇలా అస్వస్ధకు లోనయ్యారు.
ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో పుట్టపర్తి సాయిబాబా మహిమలతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సౌభాగ్య చిత్ర పతాకంపై ఈ చిత్రంలో హీరోగా ప్రముఖ మలయాళ హీరో దిలీప్ని ఎంచుకొన్నట్టు నిర్మాత కరాటం రాంబాబు వెల్లడించారు. ప్రశాంతి నిలయం సెట్ను కోటి రూపాయల వ్యయంతో అత్యంత భారీ స్థాయిలో హైదరాబాద్లో వేస్తున్నాం. ఆర్ట్ డైరక్టర్ నాగు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అనువణువూ పరిశీలించి సెట్ను తీర్చిదిద్దుతున్నారని నిర్మాత తెలిపారు.
దర్శకుడు కోడి రామకృష్ణ సాయి భక్తులను స్వయంగా కలుసుకుని వారి అనుభవాలను తెలుసుకుని ఈ చిత్రం కథ సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రంలో సత్య సాయి బాబాను ఆరునెలలు ప్రాయం నుంచి 85 ఏళ్ళ ప్రాయం వరకు వివిధ వయసుల్లో చూపెట్టనున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మొత్తం ఇందులో 14 పాటలున్నాయి. అన్నీ కథాగమనంలో కలిపోతూ సాగుతాయి. ఈ చిత్రంలో బాబా తల్లిగా జయప్రద, తండ్రిగా శరత్బాబు నటిస్తున్నారు.