Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పవన్ కళ్యాణ్ కోసం కథ, 100 కోట్ల బడ్జెట్.. కానీ కుదర్లేదు, విజయేంద్ర ప్రసాద్ శిష్యుడు!
Recommended Video
చిన్న చిత్రాలు విడుదల సమయంలో ఎలాంటి హడావిడి కనిపించదు. కానీ ఆ చిత్రాలు విజయం సాధిస్తే మాత్రం అందరూ చర్చించుకుంటారు. చిన్న చిత్రాలుగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రాలు ఇటీవల చాలానే ఉన్నాయి. ప్రేక్షకులని మెప్పించే కథ ఉంటె చాలు.. ఆ చిత్రానికి బ్రహ్మరథం పడుతారు. నూతన దర్శకుడు కోవెర తెరకెక్కించిన చిత్రం 'యు'. ఈ చిత్రంలో కోవెరే హీరోగా నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో కోవెర ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
విజయేంద్ర ప్రసాద్ శిష్యుడిగా
కోవెర మాట్లాడుతూ తాను బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ శిష్యుడిగా నాలుగేళ్లు పనిచేశా. ఆ అనుభవంతోనే యూ చిత్ర కథని రూపొందించుకున్నా అని కోవెర అన్నారు. ఓ గ్రామంలో మొదలైన కథ అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో సాగుతుంది అని తెలిపారు. భారత సినిమా చరిత్రలో ఇలాంటి కథ ఇంతవరకు రాలేదు. కథలోని కాన్సెప్ట్ చాలా ఆసక్తిగా ఉంటుందని కోవెర తెలిపాడు.
పవన్ కళ్యాణ్ కోసం
తాను వాస్తవానికి ఈ కథని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నా. 100 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కించాలని కూడా నిర్ణయించుకున్నా. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ చిత్రం తెరకెక్కించడం కుదర్లేదు అని కోవెర తెలిపారు. ఈ కథ విన్న ప్రముఖ నటులు శుభలేఖ సుధాకర్,, తనికెళ్ళ భరణి ఎంతగానో తనని ప్రోత్సహించారని కోవెర తెలిపాడు. పవన్ హీరోగా నటించాల్సిన సినిమాలో నేను నటించాల్సి వచ్చింది. దీనితో కేవలం కోటి బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పూర్తి చేశాం అని కోవెర తెలిపాడు.
తొలిసారి
హీలియం 8కె కెమెరాతో తెరకెక్కించిన తొలి ఇండియన్ మూవీ యు అని కోవెర తెలిపారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల సుకుమార్ చేతుల మీదుగా లాంచ్ అయింది. శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ.. దర్శకుడు మంచి పాత్రలో కథ సిద్ధం చేసుకుని నా వద్దకు వచ్చారు అని తెలిపారు. తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. మొదట ఈ కథని శుభలేఖ సుధాకర్ విని నా వద్దకు పంపారని అన్నారు. ఏఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
విడుదలకు రెడీ
డిసెంబర్ 14న కోవెర చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కోవెరా క్రియేషన్స్ బ్యానర్ పై కొండా విజయలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. హిమన్షి, స్వప్నా రావు హీరోయిన్లుగా నటించారు. సత్య మహావీర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.