twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గీతా ఆర్ట్స్‌ బేనర్లో మారుతి చిత్రం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మగధీర చిత్రంతో ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో రూపొందించబోయే చిత్రానికి డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మారుతి క్రేజీ డైరెక్టర్ గా మారారు. గీతా ఆర్ట్స్ నిర్మించే ఈ చిత్రంలో ఓ అగ్రకథానాయకుడు హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రారంభోత్సవ వివరాలు మరికొద్ది రోజుల్లోనే తెలుస్తాయి.

    మారుతి దర్శకత్వంలో వచ్చిన బస్టాఫ్ సినిమా వివరాల్లోకి వెళితే...ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సినిమాలో కాస్త బూతు ఎక్కువగానే ఉన్నప్పటికీ ఈ తరం యువత చెడుదారులు పడతున్న వైనాన్ని, తల్లిదండ్రుల తీరును తనదైన రీతిలో చూపించాడు దర్శకుడు మారుతి.

    లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై మల్టీ డైమెన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు 'బస్ స్టాప్' చిత్రాన్ని నిర్మించారు. యువతకు సందేశమిచ్చే ఈ చిత్రం తల్లిదండ్రుల పక్షపాతిగా దర్శకుడు తెరకెక్కించారని చెప్పొచ్చు.

    బస్ స్టాఫ్ చిత్రం కొన్ని వివాదాలకు కూడా దారితీసింది. దేనికైనారెడీ, ఎ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమాల గొడవ సద్దుమణగకముందే " బస్ స్టాప్" సినిమా వివాదంలో చిక్కుకుంది. ఆదివారం విడుదలైన " బస్ స్టాప్" సినిమాలో విపరీతమైన ద్వంద్వార్థాలు ఉన్నాయని, ఈ సినిమా విద్యార్థులు, యువతను పక్కదారి పట్టించేలా ఉందంటూ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాలు ఆందోళనకు దిగాయి.

    English summary
    
 Maruthi, who directed Eerojullo and Busstop, has clinched a bumper offer. The talented director has got an offer to work with one of the reputed production houses Geetha Arts. Producer Allu Aravind has announced that he'll be soon teaming up with Maruti for a film under the prestigious banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X