Don't Miss!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
మహానటి దర్శకుడితో ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్.. ఎంతవరకు వచ్చిందంటే?
ఇండియన్ సినిమా హిస్టారిలో లో గతంలో ఎప్పుడు లేని విధంగా పాన్ ఇండియా సినిమాలు సెట్స్ పైకొచ్చాయి. అందులే ప్రభాస్ వే నాలుగు ఉన్నాయి. అలాగే మరో రెండు మొదలు కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోయే సైన్స్ ఫిక్షన్ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమాకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ బయటపెట్టాడు.
అభిమానుల్లో కన్ఫ్యూజన్
బాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా మన టెక్నీషియన్స్ నేషనల్ లెవెల్లో ప్రభాస్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వైజయంతి ప్రొడక్షన్ లో ప్రభాస్ - నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో అభిమానుల్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది.
అప్డేట్స్ అయితే బాగానే ఇస్తున్నారు
వైజయంతి మూవీస్ మొదటి నుంచి ప్రభాస్ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని హైలెట్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటోంది. చిన్నదో పెద్దదో అప్డేట్స్ అయితే బాగానే ఇస్తున్నారు గాని ఇంకా సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ కాలేదు. లాక్ డౌన్ లోనే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్న నాగ్ అశ్విన్ ప్రభాస్ కు స్టోరీ చెప్పగానే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశాడు.
ఆలస్యం.. ఎందుకంటే..
ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ ఒకే చేసిన తరువాత సలార్ తో పాటు, ఆదిపురుష్ సినిమాలను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. అయితే సైన్స్ ఫిక్షన్ సినిమా ఎందుకు ఆలస్యం అవుతోందనే విషయంపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించాడు. నిజానికి సినిమాను ఈ ఏడాది మొదట్లోనే స్టార్ట్ చేయాలని అనుకున్నారట. కానీ ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ ఇంకా సెట్టవ్వలేదట.
సమ్మర్ మిడ్ లోనే మొదలు..
ఇంతవరకు సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి సినిమా రాలేదని ప్రీ ప్రొడక్షన్ పనులకు సమయం అనుకున్న దానికంటే ఎక్కువ అవుతోందని నాగ్ అశ్విన్ చెప్పాడు. ఇక ఫైనల్ గా సమ్మర్ మధ్యలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పాడు. సినిమా మొదలైతే అస్సలు ఆగదని ఏడాది సమయంలో ప్రాజెక్ట్ పూర్తయ్యేలా ప్రాజెక్ట్ ప్లాన్ రెడీ అవుతున్నట్లు నాగ్ అశ్విన్ వివరణ ఇచ్చారు. ఇక సినిమాల్ లో హీరోయిన్ దీపికా పదుకొనె అని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.