Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రచయిత, దర్శకుడు పూసల ఇక లేరు
హైదరాబాద్: ప్రముఖ రచయిత, దర్శకుడు పూసల వీర వెంకటేశ్వరరావు(74) కన్నుమూసారు. ఇటీవల కేర్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ చేయించుకున్న ఆయనకు కిడ్నీ సంబంధిత వ్యాధి ఎదురవ్వడంతో ఆదివారం ఉదయం 5 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
రచయితగా 64 కథలు రచించిన ఆయన ‘డాలర్ కి మరో వైపు' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. చదువుకునే రోజుల నుండి నాటకరంగంపై పూసలకు మంచి పట్టుంది. ఆయన రచించిన, నటించిన ‘మండువ లోగిలి' నాటకానికి బళ్లారి రాఘవ అవార్డుతో పాటు పలు అవార్డులు అందుకున్నారు.
ఇటీవల జయప్రకాష్ రెడ్డి కీలక పాత్రధారుడుగా ఆయన డైరెక్ట్ చేసిన ‘అలెగ్జాండర్' నాటకానికి చక్కని ప్రశంసలు అందుకున్నారు. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న ‘డాలర్ కి మరో వైపు' సినిమా మార్చిలో విడుదలకు సిద్దంగా ఉంది. పూసల అంత్యక్రియలు సోమవారం ఎర్రగడ్ర శ్మశానవాటికలో జరుగనున్నాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.