Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సోనియా గాంధీని పోలి ఉందనే సమస్య
ప్రకాష్ ఝా తాజా చిత్రం 'రాజ్నీతి' రిలీజ్ కి సోనియా గాంధీ పోలిక ఆటంకం తెచ్చిపెట్టేటట్లు ఉంది. ఆ చిత్రంలో కీలకపాత్ర చేసిన కత్రినా కైఫ్ వేషధారణ సోనియా గాంధీని పోలి ఉందంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాంతో చిత్రానికి సంబంధించిన పబ్లిసిటీ కాంపయిన్ కి ఢిల్లీలో అనుమతి లభించలేదు. డిల్లిలో ప్రకాష్ ఝాతోపాటు కత్రిన, రణబీర్ కపూర్లు ప్రేక్షకుల్ని కలుసుకొనేందుకు పర్యటన చేయాలనుకొన్నారు. అయితే పోలీసు శాఖ నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. దాంతో మీడియా దర్శకుడు ప్రకాష్ ఝాను కలిసి ప్రశ్నించింది. సోనియాని పోలిన పాత్ర ఉండటం వల్లనే అనుమతిని నిరాకరించారని మీరు భావిస్తున్నారా? అని ఆయన్ని ప్రశ్నించగా "ఈ విషయమై నేనేమీ స్పందించదలచుకోలేదు. కత్రినా పాత్రకు సోనియాకు ఎలాంటి సంబంధం లేదు. నేను మా సినిమాను త్వరలో సోనియాజీకి చూపిస్తాను. ఆమెకు నిజానిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. అలాగే 'రాజ్ నీతి' అనుకున్న డేట్ కి తప్పనిసరిగా రిలీజ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.