Don't Miss!
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
‘మహానాయకుడు’లో ఆ సీన్ చూసి వెక్కి వెక్కి ఏడ్చాను: పూరి జగన్నాధ్
ఎన్టీ రామారావు రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ఎన్టీఆర్-మహానాయుడు' సినిమా ప్రీమియర్ షోకు హాజరైన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ సినిమా చూసిన అనంతరం తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు.
'ఎన్టీఆర్-కథానాయకుడు' మూవీ నాకు ఎంత నచ్చిందో.. అంతకంటే ఎక్కువ 'మహానాయకుడు' నచ్చింది. బసవతారకంగారి గురించి చెప్పే డైలాగులు చూసి ఏడ్చాను. అసెంబ్లీలో ఆయనకు జరిగిన అవమానం చూసి వెక్కి వెక్కి ఏడ్చాను. ఇంతలా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఇంతగా ఏడవలేదని పూరి వ్యాఖ్యానించారు.
మహానాయకుడు సినిమా ఎంత గొప్పదో బాలయ్య నటన ఇంకా అంత గొప్పగా ఉంది. ఆయన కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్. నాన్నగారు అంటే ఆయనకు ఎంత అభిమానమో, ఎంత ప్రేమో నాకు తెలుసు. ఆయన ప్రేమతో ఇష్టంగా చేసిన ఫిల్మ్ ఇదన్నారు.
క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించారు. ఆయనకు జోడీగా బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించారు. చంద్రబాబు నాయుడి పాత్రలో రాణా నటించారు. ఈ చిత్రాన్ని ఎన్.బి.కె.ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణతో కలిసి విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.