twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీ కొడుకుతో అంతర్జాతీయ..

    By Staff
    |

    Aakash
    ప్రముఖ దర్శక, నిర్మాత పూరి జగన్నాథ్‌ కుమారుడు ఆకాష్‌ ప్రధాన పాత్రలో 'లోటస్‌ పాండ్‌" అనే అంతర్జాతీయ చిత్రం రెడీ కానుంది. త్రిపాదయా ఇన్నోవేషన్స్‌ మార్కెటింగ్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై వినాయకుడు" ఫేం పి.జి.విందా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. 'లోటస్‌ పాండ్‌" చిత్రం షూటింగ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులులో ఈ నెల 17న ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.యల్‌.నితిన్‌ కుమార్‌ మాట్లాడుతూ పది సంవత్సరాల వయసున్న ఇద్దరు స్కూలు విద్యార్ధులు 14000 అడుగుల ఎత్తులో ఉన్న 'లోటస్‌ పాండ్‌" లోకి వెళ్లి విహరించాలను కుంటారు. దానిని వారు ఎలా సాధించారు అన్నదే చిత్ర కథాంశం అన్నారు. ఈ సినిమా స్కూలు దశలో ఉన్న విద్యార్ధులందరినీ దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతుంది.

    ఇందులో 'చిరుత, బుజ్జిగాడు" చిత్రాల్లో చిన్నప్పటి హీరోగా నటించిన ప్రముఖ దర్శక, నిర్మాత పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మరో పాత్రలో పలు టివి సీరియల్స్‌లో నటిస్తూ గుర్తిం పు తెచ్చుకున్న బాల నటుడు రోహిత్‌ పోషిస్తున్నాడు. 'వినాయకుడు, అష్టా చెమ్మా, స్నేహగీతం" చిత్రాలకు సినీమాటోగ్రఫీ నిర్వహించిన పి.జి.విందా సినిమాటోగ్రఫీ నిర్వహిస్తూ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ప్రారంభమైంది. రెగ్యులర్‌గా షూటింగ్‌ చేస్తాం జూన్‌ మొదటివారంలో షూటింగ్‌ పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, కులువి భాషల్లో ఒకేసారి విడుదల చేసి అనంతరం ఇతర రీజనల్‌ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. బెస్టాఫ్ లక్ ఆకాష్..

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X