Don't Miss!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
టెక్నో థ్రిల్లర్ అనే కాన్సెప్ట్తో వస్తున్న ‘ఐతే 2.0’
హైదరాబాద్: 'బుషి', 'ఆంధ్రాపోరి' వంటి డిఫరెంట్ చిత్రాలతో అలరించిన దర్శకుడు రాజ్ మాదిరాజు దర్శకత్వంలో 'ఐతే 2.0' సినిమా రూపొందనుంది. ఫర్మ్9 బ్యానర్పై రూపొందుతోన్న ఈ చిత్రానికి హేహంత్ వళ్ళపు రెడ్డి, రవి.ఎన్.రధి, విజయ్రామరాజు నిర్మిస్తున్నారు. టెక్నో థ్రిల్లర్ అనే కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందనుంది.
ఈ సినిమా గురించి దర్శకడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ ''ఇప్పటి వరకు డిఫరెంట్ చిత్రాలను తెరకెక్కించిన నేను టెక్నో థ్రిల్లర్ కాన్సెప్ట్తో 'ఐతే 2.0' చిత్రాన్ని రూపొందించబోతున్నాను. ఇప్పటి యూత్ ఎక్కువగా మొబైల్స్, ల్యాప్ టాప్స్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సోషల్ మీడియాతోనే తమ సమయాన్ని గడిపేస్తూ పరిసరాలను కూడా పట్టనట్టుగా ఉండే యువతను కూడా ఒకరు గమనిస్తుంటారు. వారెవరు? ఈ సోషిల్ మీడియాను అధికంగా ఉపయోగించడం వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయనే విషయాన్ని మా ఐతే 2.0 మూవీ చూపెట్టబోతున్నామన్నారు.
ఈ కాలం యువతకు కావాల్సిన ఓ మెసేజ్ను కూడా ఇందులో అందిస్తున్నాం. ఈ సినిమా టైటిల్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ‘ఐతే' అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. గుణ్ణం గంగరాజుగారితో మాట్లాడి టైటిల్ గురించి అడిగితే తన అంగీకరించారు. అందుకే ఈ సినిమాకి ఐతే 2.0 అనే టైటిల్ పెట్టాం. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. నటీనటులు వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అన్నారు.