Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నా ఫొటో మార్ఫింగ్ చేసి.. నగ్నంగా ఉన్న మహిళ ఫోటోకు తగిలించారు.. వర్మ ఫిర్యాదు
Recommended Video
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, వర్థమాన దర్శకుడు జై కుమార్ మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. గత కొద్దికాలంగా వర్మపై జై కుమార్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనతో చాలా సినిమాలకు పని చేయించుకుని డబ్బులివ్వలేదని.. క్రెడిట్ కూడా ఇవ్వలేదని వర్మపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 'జీఎస్టీ'తో పాటు 'ఆఫీసర్' కథ కూడా తనదే అని ఇటీవల జై ఆరోపించడం సంచలనం రేపింది.
వర్మ, జై మధ్య వివాదం
జీఎస్టీ, ఆఫీసర్ చిత్రాలకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా చూపే ప్రయత్నం చేసిన జై.. వర్మకు లీగల్ నోటీస్ పంపించి కేసు కూడా పెట్టాడు. దీనిపై వర్మను అడిగితే.. స్థాయి తక్కువ వ్యక్తుల గురించి తాను మాట్లాడనన్నాడు. అలా కామెంట్స్ చేసిన వర్మ తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని జై వెల్లడించారు. తనపై చేసిన ఫిర్యాదుకు తాను షాక్ తిన్నానని ఆయన పేర్కొన్నారు.
ఆర్జీవి ఫిర్యాదు ఇలా
వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. జై అనే వ్యక్తి తన ఫొటోను మార్ఫింగ్ చేసి.. నగ్నంగా ఉన్న ఒక మహిళ శరీరానికి తగిలించాడు. దానిని సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ రకంగా తన ఇమేజ్ దెబ్బ తీసే ప్రయత్నం చేసిన వ్యక్తిపై మీద చర్యలు తీసుకోవాలి అని వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అని జై ఓ ప్రకటనలో వెల్లడించారు.
వర్మపై జై విమర్శలు
నా ఆరోపణలపై స్పందించడానికి స్థాయి సరిపోదన్న వర్మ.. ఇలాంటి సిల్లీ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లడమేంటో అర్థం కావడం లేదని జై సందేహాన్ని వ్యక్తం చేశారు. నా ఆరోపణలకు స్పందించకుండా నాపై ఫిర్యాదు చేయడంతో నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదని జై తన ప్రకటనలో పేర్కొన్నారు.
నాపై నాసిరకంగా ఫిర్యాదు
వర్మ లాంటి సెలబ్రీటి ఎవరిపైనైనా ఫిర్యాదు చేశారంటే ఏదో బలమైన కారణముందని అనుకొంటారు. కానీ ఇలా నాసిరకంగా నాపై ఫిర్యాదు చేయడం ఆశ్చర్య కలిగించింది. నాపై ఫిర్యాదు చేసి తన స్థాయిని తగ్గించుకొన్నారు అని జై విమర్శించారు.