Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కెరీర్ లోనే మొదటిసారి అలాంటి కథను టచ్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసినా కూడా గతంలో ఎప్పుడు ట్రై చేయని విదంగా ఉంటుందని చెప్పవచ్చు. వీలైనంత వరకు ధైర్యంగానే డిఫరెంట్ కథలను టచ్ చేస్తుంటారు. వివాదం ఎంత ఉంటే అంత పబ్లిసిటీ అనే కాన్సెప్ట్ తోనే కాంట్రవర్సీ కథలను టచ్ చేస్తుంటాడు. మొదటి సినిమా నుంచి కూడా వర్మ ఎవరు చేయని ప్రయోగాలు చేస్తున్నాడని చెప్పవచ్చు.
కరోనా టైమ్ లోనే ఎవరు షూటింగ్స్ చేయని పరిస్థితుల్లో సినిమాను పూర్తి చేసి షాక్ ఇచ్చాడు. ఇక ఓటీటీ బిజినెస్ పై కూడా ఎవరు ఊహించని విధంగా ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే. ఆ మధ్య బోల్డ్ కంటెంట్స్ తో ఓ వర్గం వారికి షాక్ ఇచ్చాడు. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. వర్మ తన కెరీర్ లో ఇప్పటివరకు టచ్ చేయని జానర్ ను మొదటిసారి టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఆర్జీవి ఇంతవరకు ఎలాంటి సినిమా చేయలేదు. ఇక మొదటిసారి ఆ జానర్ ను టచ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చేశాడు. గతంలో న్యూక్లియర్ బాంబ్ బ్యాక్ డ్రాప్ లో కూడా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేసిన వర్మ ఆ తరువాత ఎందుకో మళ్ళీ అటువైపు వెళ్లలేదు.
ఇక ప్రస్తుతం స్పార్క్ అనే ఓటీటీ సంస్థను ఎలాగైనా జనాల్లోకి మరింత లోతుగా తీసుకు వెళ్లాలని వర్మ గట్టి ప్లాన్ అయితే వేసినట్లు సమాచారం. అందులోనే కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వనున్నాడు. ఇక వర్మ టచ్ చేయబోయే కొత్త జానర్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.