Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాజమౌళి 'ఈగ'లాగే పందిపిల్ల హీరోగా, డైరక్టర్ రవిబాబు
హైదరాబాద్ : అవును..నిజమే...రవిబాబు ఇప్పుడో పంది పిల్లను ప్రధాన పాత్రగా తీసుకుని ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. అల్లరి,అనసూయ, నచ్చావులే, అవును అంటూ విభిన్నమైన చిత్రాలు చేస్తూ వచ్చిన ఆయనకు దర్శకుడుగా ఫాన్ ఫాలోయింగ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు రవిబాబు ... 'అదుగో' అనే టైటిల్ తో ఓ చిత్రం గుట్టు చప్పుడు కాకుండా ఫినిష్ చేసేసారు.
రాజమౌళి 'ఈగ'తో సినిమా చేసినట్లే రవిబాబు...పందిపిల్లతో సినిమా అన్నమాట. ఈ సినిమాలో హీరో, హీరోయిన్, మిగిలిన పాత్రలూ ఉంటాయి. కానీ కథకు ఆధారం, ప్రాణం మాత్రం పందిపిల్లేనట. పంది పిల్లతో నవ్విస్తాడట. ఎమోషన్స్ పండిస్తాడట.
రవిబాబు మాట్లాడుతూ.... ''ఏడాదిన్నర క్రితం ఈ చిలిపి ఆలోచన వచ్చింది. ఇది వరకు కుక్క, పిల్లి, గుర్రం, కోతి లాంటి జంతువులతో సినిమా తీశారు. కానీ పందిపిల్లతో ఎవ్వరూ తీయలేదు. హాలీవుడ్లో మాత్రం ఓ సినిమా వచ్చిందట. 'జురాసిక్ పార్క్' లాంటి సినిమాలు యానిమేట్రానిక్స్ అనే టెక్నాలజీతో తీస్తారు.
దాన్ని కొనాలంటే ఓ పెద్ద హీరో రెమ్యునరేషన్ అంత ఉంది. అందుకే ఆ సాఫ్ట్వేర్ని తయారు చేయించాం. ఏడు నెలల పాటు దానికే సమయం పట్టేసింది. టెస్ట్ షూట్ చేసినప్పుడు కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో మరో రెండు నెలలు సమయం వెచ్చించి సాఫ్ట్వేర్లో మార్పులు చేశాం.
కొంత యానిమేట్రానిక్స్, కొంత యానిమేషన్, కొంత లైవ్ యాక్షన్... ఇలా సినిమాని ప్లాన్ చేసుకొన్నాం. ఇలాంటి సినిమాల్ని రామోజీ ఫిల్మ్సిటీలో తప్ప మరెక్కడా తీయలేం. ఫిల్మ్సిటీలోనే మూడు నెలల పాటు షూటింగ్ జరిపాం.
అభిషేక్, నాబ హీరో,హీరోయిన్స్ గా నటించారు. ఇద్దరూ కొత్తవాళ్లే. రెగ్యులర్ కమర్షియల్ సినిమానే. హాలీవుడ్లో డిస్నీ సంస్థ ఇలాంటి సినిమాల్ని తీస్తుంటుంది. వాళ్ల సినిమాలు చూస్తే అన్ని వర్గాల వాళ్లకు సంబంధించిన ఏదో ఓ అంశం సినిమాలో కనిపిస్తుంటుంది. 'అదుగో' కూడా అలాంటి సినిమానే.
షూటింగ్ కోసం చాలా కష్టపడ్డాం. పందులపై రీసెర్చ్ కూడా చేశాను. ఓ పందిపిల్లను కొన్నాళ్ల పాటు పెంచుకొన్నా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''అన్నారు.