Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సిబీఐ ఆఫీసర్ తో బాలకృష్ణ సంవాదం నచ్చింది
హైదరాబాద్: సిబీఐ ఆఫీసర్ తో బాలకృష్ణ చేసే సంవాదం నాకు నచ్చిన సన్నివేసం. అలాగే సెకండాఫ్ లో బాలకృష్ణ నరసింహస్వామిగా కనపడి విలన్ ని చంపటం కూడా నేను చాలా ఇష్టపడి చేసాను అన్నారు రవిచావలి. బాలకృష్ణ, రవిచావలి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం శ్రీమన్నారాయణ. ఈ చిత్రం క్రిందటి వారం విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాను దర్శకుడు రవిచావలి కలిసి మాట్లాడారు. ఆయన మాటల్లో చిత్రంలో తనకు ఇష్టమైన సీన్స్ ప్రస్దావిస్తూ ఇలా చెప్పుకొచ్చారు.
అలాగే తాను ప్రత్యేకంగా బాలకృష్ణను దృష్టిలో పెట్టుకునే జర్మలిస్టు కథను రాసానని అన్నారు. ఇక జర్నలిస్టు ..మర్డర్స్ చేయటం అనే అంశం ప్రేక్షకులు ఒప్పుకోకపోయినా కూడా ఆ జర్నలిస్టులో కూడా సామాన్యుడు ఉన్నాడని గమనించాలని అన్నారు. ఇక సినిమాలో ఎంటర్టైన్మెంట్ తగ్గిన విషయం ప్రస్దావిస్తే..తనకు కామెడీ ట్రాక్ కోసం కథను ట్రాక్ తప్పించి నడపటం ఇష్టం ఉండదని చెప్పుకొచ్చారు.
ఇక బాలకృష్ణ చేయటం తనకు మంచి అనుభూతి అని అన్నారు. గతంలో తాను ఎన్ని చిత్రాలు తీసినా ఈ చిత్రంతోనే కమర్షియల్ దర్శకుడుగా పరిశ్రమ గుర్తించటం ఆనందం కలిగించిన విషయం అని చెప్పుకొచ్చారు. అలాగే బాలకృష్ణ అంటే ఆయన ప్యాన్స్ లో,ప్రేక్షకుల్లో ప్రత్యేకంగా అంచనాలు ఉంటాయని, వాటిని దృష్టిలో పెట్టుకునే మొదటినుంచీ పనిచేసామని అన్నారు. హీరోని కొత్తగా చూపాలనే తన ప్రయత్నం ఫలించిందని,దుస్తులు,ఫైట్స్,డైలాగ్స్ లో ప్రత్యేక శ్రధ్ద తీసుకున్నామని, బాలకృష్ణ కూడా బాగా సహకరించారని చెప్పుకొచ్చారు.
బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా, విజయ్ కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్ సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్: రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్: ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్: కమల్ మోహన్ రావు, రామ్మోమన్, నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్ చావలి.