Don't Miss!
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సిబీఐ ఆఫీసర్ తో బాలకృష్ణ సంవాదం నచ్చింది
హైదరాబాద్: సిబీఐ ఆఫీసర్ తో బాలకృష్ణ చేసే సంవాదం నాకు నచ్చిన సన్నివేసం. అలాగే సెకండాఫ్ లో బాలకృష్ణ నరసింహస్వామిగా కనపడి విలన్ ని చంపటం కూడా నేను చాలా ఇష్టపడి చేసాను అన్నారు రవిచావలి. బాలకృష్ణ, రవిచావలి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం శ్రీమన్నారాయణ. ఈ చిత్రం క్రిందటి వారం విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాను దర్శకుడు రవిచావలి కలిసి మాట్లాడారు. ఆయన మాటల్లో చిత్రంలో తనకు ఇష్టమైన సీన్స్ ప్రస్దావిస్తూ ఇలా చెప్పుకొచ్చారు.
అలాగే తాను ప్రత్యేకంగా బాలకృష్ణను దృష్టిలో పెట్టుకునే జర్మలిస్టు కథను రాసానని అన్నారు. ఇక జర్నలిస్టు ..మర్డర్స్ చేయటం అనే అంశం ప్రేక్షకులు ఒప్పుకోకపోయినా కూడా ఆ జర్నలిస్టులో కూడా సామాన్యుడు ఉన్నాడని గమనించాలని అన్నారు. ఇక సినిమాలో ఎంటర్టైన్మెంట్ తగ్గిన విషయం ప్రస్దావిస్తే..తనకు కామెడీ ట్రాక్ కోసం కథను ట్రాక్ తప్పించి నడపటం ఇష్టం ఉండదని చెప్పుకొచ్చారు.
ఇక బాలకృష్ణ చేయటం తనకు మంచి అనుభూతి అని అన్నారు. గతంలో తాను ఎన్ని చిత్రాలు తీసినా ఈ చిత్రంతోనే కమర్షియల్ దర్శకుడుగా పరిశ్రమ గుర్తించటం ఆనందం కలిగించిన విషయం అని చెప్పుకొచ్చారు. అలాగే బాలకృష్ణ అంటే ఆయన ప్యాన్స్ లో,ప్రేక్షకుల్లో ప్రత్యేకంగా అంచనాలు ఉంటాయని, వాటిని దృష్టిలో పెట్టుకునే మొదటినుంచీ పనిచేసామని అన్నారు. హీరోని కొత్తగా చూపాలనే తన ప్రయత్నం ఫలించిందని,దుస్తులు,ఫైట్స్,డైలాగ్స్ లో ప్రత్యేక శ్రధ్ద తీసుకున్నామని, బాలకృష్ణ కూడా బాగా సహకరించారని చెప్పుకొచ్చారు.
బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా, విజయ్ కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్ సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్: రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్: ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్: కమల్ మోహన్ రావు, రామ్మోమన్, నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్ చావలి.