Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సీడీ ఇచ్చి చూడమని చెప్పా.. అంతమందిలో ముద్దు పెట్టుకోవడం.. హీరోయిన్పై డైరెక్టర్ కామెంట్స్!
మీటూ ఉద్యమ ధాటికి సినీప్రముఖులు జాతకాలాన్ని బయట పడుతున్నాయి. బాలీవుడ్ లో అయితే మీటూ ఉద్యమం పెను సంచలనం సృష్టిస్తోంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన నటీమణులంతా తమకు జరిగిన సంఘటనలని బయట పెడుతున్నారు. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్లు, నటులపై తీవ్రమైన ఆరోపణలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ సంజన కూడా దర్శకుడు రవి శ్రీవత్సపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. సంజన ఆరోపణలపై రవి శ్రీవత్స స్పందించారు.
ఆ డైరెక్టర్ సైకో, నరకం చూపాడు ..... ఆ హాట్ సీన్లు చూసి నాన్న బాధపడ్డారు: సంజన
ఒక ముద్దు అని చెప్పి
గండ హెండతి చిత్రంతో ముద్దుల పేరుతో దర్శకుడు తనని వేధించాడని సంజన ఆరోపించింది. ఏ చిత్రంలో కేవలం ఒకే ముద్దు సన్నివేశం ఉంటుందని చెప్పి చివరకు 30 ముద్దులు పెట్టించాడని సంజన ఆరోపించింది. దర్శకుడు కూడా తనకు ముద్దులు పట్టేందుకు ప్రయత్నించాడని సంజన తీవ్రమైన ఆరోపణలు చేసింది.
ఎలా ముద్దు పెట్టగలను
షూటింగ్ లో అంత మంది మధ్య హీరోయిన్ కి తాను ఎలా ముద్దు పెట్టగలను అని దర్శకుడు శ్రీవత్స ప్రశ్నించారు. సంజన కావాలనే తనపై అక్కసుతో ఆరోపణలు చేస్తోందని రవి శ్రీవత్స అన్నారు. తాను సినిమా చేసింది ముద్దులు పెట్టడానికి కాదని బదులిచ్చారు.
చూడమని సీడీ ఇచ్చా
గండ హెండతి చిత్రం మర్డర్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోందని ఒకటికి రెండు సార్లు ఆమెతో చర్చించిన తరువాతే సినిమాలోకి తీసుకున్నాము. మర్డర్ చిత్రాన్ని చూడమని ఆమెకు సీడీ కూడా ఇచ్చానని దర్శకుడు పేర్కొన్నాడు. సంజన పబ్లిసిటీ కోసమే ఆరోపణలు చేస్తున్నట్లు ఉందని రవి శ్రీవత్స అన్నారు.
చట్టపరమైన చర్యలు
తనకు శుక్రవారంలోగా సంజన క్షమాపణలు చెప్పాలి. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని హెచ్చరించారు. మీటూ ఉద్యమాన్ని కొందరు పబ్లిసిటీ కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.