Don't Miss!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మళ్ళీ కలర్స్ స్వాతినే తీసుకున్న డైరక్టర్
అష్టాచెమ్మ చిత్రంతో పాపులరైన కలర్స్ స్వాతి ముచ్చటగా మూడో సారి ఇంద్రగంటి మోహన్ కృష్ణ చిత్రంలో బుక్కయింది. సుశాంత్ హీరోగా చేస్తున్న చిత్రంలో ఆమెనే మళ్ళీ తీసుకున్నాడు. అష్టాచెమ్మ,గోల్కొండ హైస్కూల్ చిత్రాల్లో ఆమెను తీసుకున్న మోహన్ కృష్ణ ఆమెను తన లక్ గా భావిస్తున్నాడని చెప్తున్నారు. అందుకే మరోసారి ఆమెనే తన ప్రాజెక్టులోకి తీసకున్నాడు. ఇక కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం..కలవరమాయే మదిలో, అప్లలరాజు,గోల్కొండ హైస్కూల్ అంటూ వరస ప్లాప్ ల్లో మునిగితేలుతున్న ఆమె మళ్ళీ ఈ చిత్రంతో మళ్ళీ నిలబడతానని భావిస్తోంది. ఇక ఈ చిత్రానికి "తొక్కుడు బిళ్ళ" అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
గోల్కొండ హైస్కూల్ కు ముందు రాసుకున్న కథతో ఇంద్రగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గోల్కొండ హైస్కూల్ మంచి చిత్రమని పేరు తెచ్చుకున్నా ఆశించిన ఫలితం రాకపోవటంతో ఈ చిత్రాన్ని అష్టాచెమ్మ తరహాలో కామిడీ ఎంటర్టైనర్ గా మలిచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఇక ఈ చిత్రం గురించి సుశాంత్ తల్లి ఎ.నాగసుశీల మాట్లాడుతూ 'సుశాంత్ చేసిన రెండు సినిమాల్లో మంచి పెర్ ఫార్మర్ గా పేరు వచ్చింది. మేం స్టార్ట్ చెయ్యబోతున్న ఈ మూడో చిత్రం ద్వారా తప్పకుండా సుశాంత్ మరోసారి అందరి ప్రసంసలు అందుకుంటాడు. మా బ్యానర్ లో ఇది మరో మంచి సినిమా అవుతుందంటూ నమ్మకం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగ సుశీల, కథ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.