Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
షూటింగ్లో హీరోయిన్కు చేదు అనుభవం.. తాగుబోతు పనిపట్టిన అల్లు శిరీష్!
మెగా హీరో అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం ఎబిసిడి. అమెరికన్ బార్న్ కంఫ్యూజ్డ్ దేశీ అనేది క్యాప్షన్. మాలయంలో ఘనవిజయం సాధించిన చిత్రానికి ఇది రీమేక్. అల్లు శిరీష్ సరసన రుక్సార్ దిల్లోన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ని బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. మెల్ల మెల్లగా అంటూ సాగే ఈ మెలోడీ గీతం ఆకట్టుకునే విధంగా ఉంది. జుడా శాండీ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. సాంగ్ లాంచ్ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు సంజీవ్ రెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
బెంగుళూరులో వెళుతుండగా
తాను బెంగుళూరులో వెళుతుండగా ఓ కన్నడ సాంగ్ ని విన్నానని అల్లు శిరీష్ తెలిపాడు. ఆ సాంగ్ చాలా నచ్చేసింది. ఇలాంటి కొత్తదనం ఉన్న సంగీత దర్శకుల కోసమే వెతుకుతున్నా. ఈ పాటని ఎవరు కంపోజ్ చేశారు అని ఆరా తీస్తే జుడా శాండీ అనే యువ సంగీత దర్శకుడు అని తెలిసిందే. వెంటనే అతడితో మాట్లాడి తమ ఎబిసిడి చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నాం అని అల్లు శిరీష్ తెలిపారు.
రుక్సార్కు చేదు అనుభవం
దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. మెల్ల మెల్లగా సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. ఈ సాంగ్ ని మేము రోడ్ లో షూట్ చేస్తున్నాం. ఆ సమయంలో కొంతమంది తాగుబోతులు అటుగా వెళుతున్నారు. అందులో ఒక వ్యక్తి రుక్సార్ ని కామెంట్ చేస్తూ వెళ్ళిపోయాడు. మేమెంతా షూటింగ్ బిజీలో ఉంది పట్టించుకోలేదు. కానీ అల్లు శిరీష్ మాత్రం షాట్ అయిపోగానే కారులొ వెళ్లి రుక్సార్ ని కామెంట్ చేసిన వ్యక్తిని తీసుకుని వచ్చాడు. ఆమెకు క్షమాపణ చెప్పించాడు అని సంజీవి రెడ్డి షూటింగ్ లో జరిగిన సంఘటనని వివరించారు.
వాళ్లంతా మన ఫ్యామిలీనే
ఈ మీడియా సమావేశంలో మాస్టర్ భరత్ అందరి హృదయాలు గెలుచుకున్నాడు. మాస్టర్ భరత్ ఎబిసిడి చిత్రంలో అల్లు శిరీష్ కు స్నేహితుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తన ప్రసంగంలో పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన వీర జవానుల గురించి ప్రస్తావించాడు. మనం ఇప్పుడు ఇక్కడ ఇంత సంతోషంగా, కూల్ గా ఉన్నామంటే దానికి కారణం పుల్వామా ఘటనలో మరణించిన వీర సైనికుల వల్లే అని భరత్ తెలిపాడు. వాళ్లంతా మన కుటుంబమే అని అన్నాడు. వాళ్ళని గుర్తు చేసుకోవడం మన భాద్యత అని భరత్ తెలిపాడు.
చాలా జరిగాయక్కడ
చైల్డ్ ఆర్టిస్ట్ గా అల్లరి పాత్రలో భరత్ అందరిని అలరించిన సంగతి తెలిసిందే. భరత్ లో ఆ అల్లరి ఇప్పటికీ ఉన్నట్లుంది. షూటింగ్ లో చాలా విషయాలు జరిగాయి. వాటన్నింటి గురించి ఇప్పుడే మాట్లాడను అని అన్నాడు. మార్చి 21న ఎబిసిడి చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మధుర శ్రీధర్, యాష్ రంగినేని ఈ చిత్రానికి నిర్మాతలు.