Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తమన్నా చెప్పే మాటలు ట్రైలర్కు హైలెట్
హైదరాబాద్ : అజిత్, తమన్నా తొలిసారి జంటగా నటించిన చిత్రం 'వీరం'. 'శౌర్యం', 'శంఖం', 'దరువు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన శివ దీన్ని తెరకెక్కించారు. ఇందులో విదార్థ్, అప్పుకుట్టిలతోపాటు పలువురు నటించారు. అజిత్ నలుగురు తమ్ముళ్లకు అన్నగా నటించారు. ఆట ఆరంభ, చండీ చిత్రాలను అందించిన నిర్మాత డాశ్రీనుబాబు మరో భారీ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అందిస్తున్నాడు. ఒమిక్స్ క్రియేషన్స్ పతాకంపెై ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి వీరుడొక్కడే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తమిళంలో ఈనెల 10న వీరం చిత్రం రిలీజ్ అవుతోంది.
దర్శకుడు శివ మాట్లాడుతూ.. '' శివా... గ్రామీణ వాసన నిండేలా.. కథలో బంధుత్వం, స్నేహితులు ఎక్కువగా ఉండేలా ఓ మంచి కథను ఎంచుకో. నటించాలనుందని అజిత్ చెప్పారు. అప్పుడే 'వీరం' కథ వినిపించా. ఆయన వెంటనే ఒప్పేసుకున్నారు. పండుగకు తగ్గ కుటుంబ చిత్రమిది. అజిత్ను మాస్గా చూడాలనుకునే అభిమానులకు ఇది పెద్ద పండగే. ఈ సినిమా ట్రైలర్ను ఓ టీవీ ఛానల్లో బుధవారం విడుదల చేశారు. యూట్యూబ్లో అమితంగా స్పందన వస్తోంది. 'మీ అన్నయ్య.. గంభీరమైన వ్యక్తి.. చాలా మంచివాడు.. హ్యాండ్సమ్..' అంటూ అజిత్ గురించి తమన్నా చెప్పే మాటలు ట్రైలర్కు హైలెట్గా నిలుస్తున్నాయి.
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ. '' అజిత్ సినిమాకు తొలిసారి సంగీతం సమకూర్చడం చాలా సంతోషంగా ఉంది. స్టూడియోకు వచ్చిన అజిత్.. అన్ని వాద్య పరికరాలను వాయించారు. అంతేకాకుండా కొన్ని ట్యూన్ల రూపకల్పనను దగ్గరుండి చూశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది''అని చెప్పారు.
నిర్మాత జి.శ్రీనుబాబు మాట్లాడుతూ... విజయప్రొడక్షన్ సంస్థ వారు ఈ చిత్రం హక్కులను మాకు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఆట ఆరంభం చిత్రం ప్రమోషన్ని బాగా చేసినందుకు అజిత్ ప్రత్యేకంగా ఈ సినిమా హక్కులను మాకే ఇవ్వడానికి చొరవ చూపారు. చాలా సంతోషం. అజిత్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రం కథ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి పెద్ద ప్లస్. అజిత్, తమన్నాలపెై స్విట్జర్లాండ్లో తీసిన పాటలు సూపర్గా ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా రాజమండ్రి, అరకులోయ, రామోజీ ఫిలింసిటీలలో షూట్ చేశారు.
అరకు లోయలో 15 రోజుల పాటు చిత్రీకరించిన ట్రైన్ ఫెైట్ ఈ చిత్రానికి హైలెైట్. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జనవరి మొదటి వారంలో ఆడియోను విడుదల చేసి... చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆట ఆరంభం సినిమాలో అజిత్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టు కుంది. ఈ చిత్రంతో కూడా అజిత్ ప్రేక్షకులను అలరిస్తారు అన్నారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీః వెట్రి, నిర్మాతః డాశ్రీనుబాబు.