Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
వెంకీ 'దృశ్యం' తెర వెనక కథ
హైదరాబాద్ : 'వెంకటేష్తో ఓసారి మాట్లాడండి. వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు..' అని సూచించారు కమల్. ఓ టీనేజ్ అమ్మాయికి తండ్రిగా నటించడానికి.. వెంకటేష్ ఒప్పుకుంటారా? తటపటాయించాను. జయసుధకు చెప్పా. తన ద్వారా రామానాయుడు గారితో మాట్లాడాం! 'శ్రీప్రియే దర్శకురాలైతే ఏం ఇంకేం కావాలి..' అంటూ వెంకటేష్ కూడా ముందుకొచ్చారు. అంతేకాదు, సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామిగానూ ఉంటానంది. వెంకటేష్ హీరో కావడంతో నా బాధ్యత వందరెట్లు పెరిగింది. కానీ విజయంపై నమ్మకం ఖాయమైంది అంటున్నారు దర్శకురాలు శ్రీప్రియ. వెంకటేష్ తో ఆమె రీసెంట్ గా తీసిన దృశ్యం చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారామె.
అలాగే... మలయాళం స్క్రిప్ట్లో మార్పులూ చేర్పులూ చేశా. అక్కడ మోహన్లాల్ చేసిన పాత్రని తెలుగు మనసులకు దగ్గరగా ఉండేలా మార్చుకున్నాను! అరకులోయ అందాల్నీ, యాసా వేషభాషల్నీ అక్కడక్కడా అద్దాను. 'వెంకటేష్.. ఓ మహిళా దర్శకురాలితో పనిచేయడం ఇదే తొలిసారి' అని చెప్పి నన్ను ఆశ్చర్యపరిచాడు! చిత్రీకరణ మొదలు కాగానే.. కమల్ ఈ చిత్రానికి వెంకటేష్ పేరునే ఎందుకు సూచించారో అర్థమైంది! వెంకటేష్ తనదైన తపనతో.. మోహన్లాల్కి సమానంగానే పాత్రలో లీనమయ్యాడు. ఇక మీనాకి నటన గురించి పాఠాలు చెప్పడమంటే చేపపిల్లకు ఈత నేర్పడమే కదా! తెలుగు ప్రేక్షకులు మెచ్చిన అత్త, అదే నదియా... నా తర్వాతి తరం హీరోయిన్గా తెలుసు కానీ ఎంతో పరిణతి ఉన్న నటిగా ఇప్పుడే అర్థమైంది అన్నారు.
ఇక సినిమా పరిశ్రమలో పనిచేసే చాలామంది కల దర్శకత్వం చేయడమే! నేనూ అంతే! దర్శకురాలిగా పాతికేళ్ల కిందటే మెగాఫోన్ పట్టాను. మోహన్, వూర్వశి జంటగా ఓ సినిమా తీశా. తరవాత 'నీయా' అనే హారర్ చిత్రానికి కొనసాగింపు రూపొందించాను. మధ్యలో 'చిన్నపాప.. పెద్దపాప' అనే సీరియల్లో కామెడీ నాయికగా చేస్తే... స్పందన అదిరిపోయింది. ఉత్సాహంతో వరుసగా ఐదు సీరియళ్లకీ, రెండు కన్నడ సినిమాలకీ దర్శకత్వం వహించా.
ఆ తర్వాతే, సమాజంలోని అకృత్యాలకు బలైన ఓ అమ్మాయి తన పగ తీర్చుకునే కథతో 'మాలినీ 22-విజయవాడ' రూపొందించా. దాని క్త్లెమాక్స్లో నాయిక నిత్యామీనన్ వెళ్లగక్కే ఆవేశం.. ఆక్రోశం నావే! ఈలోపు మలయాళంలో 'దృశ్యం' విడుదలై, విజయం సాధించింది. దాని హక్కులు మేం కొన్నాం. తమిళంలో కమల్హాసన్ చేయడానికి ముందుకొచ్చారు. మరి తెలుగులో అంటే వెంకటేష్ ముందుకు వచ్చి హిట్ కొట్టారు అని చెప్పారామె.