Don't Miss!
- Sports T20లో డబుల్ సెంచరీ: ఆ భారత ప్లేయర్కే సాధ్యం- విలియమ్సన్
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అది..మురళీ మోహన్ ఆర్టిస్ట్ అసోసియేషన్గా మారింది
హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ‘మా' అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్, జయసుధ మధ్య పోటీ వాతావరణం రాజకీయ ఎన్నికలను తలపిస్తోంది. ఆర్టిస్టులంతా వీరిద్దరి తరుపున రెండు గ్రూఫులుగా విడిపోయారు.
రాజేంద్రప్రసాద్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా..... మురళీ మోమన్ తను ఈ సారి మళ్లీ పోటీ చేయకుండా జయసుధను రంగంలోకి దింపారు. అయితే ఇప్పటి వరకు ‘మా' అధ్యక్షుడిగా ఉన్న మురళీ మోహన్ పై పలువురు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.
మురళీమోహన్ పై దర్శకుడు శ్రీనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మా అంటే మురళీమోహన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ గా తయారు చేశారని ఆయన విమర్శించారు. ఆయన చాలా కాలం పాటు 'మా' అధ్యక్ష పదవిని నిర్వహించారని, చంద్రబాబు వద్ద పనిచేసినా కూడా.. 'మా' కోసం ఒక్క భవనం కూడా తీసుకురాలేకపోయారని శ్రీనాథ్ విమర్శించారు. అన్ని పదవులూ మురళీమోహనే అనుభవించాలనుకుంటున్నారని, బతికున్న లెజెండ్స్ ను మర్చిపోయి.. చనిపోయినవారి కోసం మృత్యుంజయ హోమం చేయించారని దర్శకుడు శ్రీనాథ్ అన్నారు.