Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దర్శకుడు సుకుమార్కు తీరని విషాదం.. తీవ్ర దిగ్బ్రాంతిలో..
దర్శకుడు సుకుమార్ స్నేహితుడు, తన మేనేజర్, నిర్మాత వీఇవీకేడీఎస్ ప్రసాద్ ఇక లేరు. నిన్నటి వరకు ఆరోగ్యంగా నవ్వుతూ ఇతరులకు స్ఫూర్తినిచ్చే ప్రసాద్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ప్రసాద్ మరణంతో సుకుమార్ విషాదంలో మునిగిపోయారు. ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.
శనివారం అస్వస్థతకు లోనై
టాలీవుడ్ నిర్మాత వీఇవీకేడీఎస్ ప్రసాద్ శనివారం అస్వస్థతకు లోనయ్యారు. మధ్యాహ్నం ఆయనకు తీవ్రమైన గుండె పోటు వచ్చింది. హాస్పిటల్కు తరలించే క్రమంలోనే ఆయన మరణించారు. ఆయన మరణ వార్త తెలియగానే దిగ్బ్రాంతికి లోనయ్యాం అని సన్నిహితులు తెలిపారు. ప్రసాద్ స్వస్థలం కాకినాడ. 1967 మే 7వ తేదీన జన్మించారు.ఆయనకు భార్య వింటి పద్మజ, ఇద్దరు కూతుళ్లు వింటి సాయి ప్రణీత, సత్య ప్రణీత ఉన్నారు.
నిర్మాతగా కూడా
దర్శకుడు
సుకుమార్కు
వీఇవీకేడీఎస్
ప్రసాద్
అత్యంత
సన్నిహితుడే
కాకుండా
నమ్మకమైన
మనిషి.
గత
కొద్దికాలంగా
సుకుమార్కు
మేనేజర్గా
ఆయన
బాధ్యతలను
చూసుకొంటున్నారు.
ఇక
అమరం
అఖిలం,
ప్రేమ
అనే
సినిమాకు
నిర్మాతగా
కూడా
వ్యవహరించారు.
విషాదంలో సుకుమార్
ప్రసాద్ మృతితో సుకుమార్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. తాను ఎప్పుడు నిరాశ, నిస్పృహలో ఉన్నా నా మిత్రుడు అండగా నిలిచేవారు. ప్రసాద్తో మాట్లాడితే ఎక్కడాలేని ఎనర్జీ వచ్చేది. నా జీవితంలో ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆయన మరణం తనకు తీరని లోటు అని సుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video
ఆయన లేని లోటు పూడ్చలేనిది
వీఇవీకేడీఎస్
ప్రసాద్
మరణం
నాకు
ఎంతో
లోటు.
ఆయన
లేనిలోటును
ఎవ్వరూ
రీప్లేస్
చేయలేరు.
ప్రసాద్
ఏ
లోకాలో
ఉన్నా
ఆయన
ఆత్మకు
శాంతి
చేకూరాలి.
ఆయన
కుటుంబ
సభ్యులకు
భగవంతుడు
మనోధైర్యాన్ని
ఇవ్వాలి.
ఆయన
కుటుంబానికి
నా
ప్రగాఢ
సానుభూతి
అని
సుకుమార్
విషాదంలో
మునిగిపోయారు.