Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఉదయ్ కిరణ్ బయోపిక్ పై దర్శకుడు తేజ క్లారిటి ఇచ్చాడు!
నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్ చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి. 'నువ్వునేను' సినిమాతో ఉదయ్ కిరణ్ని తెలుగు తెరకి పరిచయం చేసిన తేజ ఆయన జీవితంలో మంచీచెడులు, ఎత్తుపల్లాలు, జయాపజయాలను తెలిసిన వాడిగా తేజ ఈ సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
కాని తాజా సమాచారం మేరకు ఈ న్యూస్ లో నిజం లేదని సమాచారం. ఉదయ్ కిరణ్ బయోపిక్ చేసే ఆలోచనే తనకు లేదని, ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టుకొస్తాయో తెలియడంలేదని అన్నారు తేజ. గత రెండు రోజులుగా ఉదయ్ కిరణ్ బయోపిక్ గురించి న్యూస్ మనం వింటున్నాం. కాని ఆ రూమర్స్ ను తేజ కొట్టిపాడేయడం జరిగింది.
తేజ తన తర్వాతి చిత్రం పూర్తి యాక్షన్ నేపద్యంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. రానా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని వెల్లడించారు. తేజ క్లారిటీతో ఉదయ్ కిరణ్ బయోపిక్స్కి సంబంధించిన రూమర్స్కి బ్రేక్ పడింది. త్వరలో రానాతో చెయ్యబోయే సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.