Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఉదయ్ కిరణ్ బయోపిక్ పై దర్శకుడు తేజ క్లారిటి ఇచ్చాడు!
నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్ చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి. 'నువ్వునేను' సినిమాతో ఉదయ్ కిరణ్ని తెలుగు తెరకి పరిచయం చేసిన తేజ ఆయన జీవితంలో మంచీచెడులు, ఎత్తుపల్లాలు, జయాపజయాలను తెలిసిన వాడిగా తేజ ఈ సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
కాని తాజా సమాచారం మేరకు ఈ న్యూస్ లో నిజం లేదని సమాచారం. ఉదయ్ కిరణ్ బయోపిక్ చేసే ఆలోచనే తనకు లేదని, ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టుకొస్తాయో తెలియడంలేదని అన్నారు తేజ. గత రెండు రోజులుగా ఉదయ్ కిరణ్ బయోపిక్ గురించి న్యూస్ మనం వింటున్నాం. కాని ఆ రూమర్స్ ను తేజ కొట్టిపాడేయడం జరిగింది.
తేజ తన తర్వాతి చిత్రం పూర్తి యాక్షన్ నేపద్యంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. రానా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని వెల్లడించారు. తేజ క్లారిటీతో ఉదయ్ కిరణ్ బయోపిక్స్కి సంబంధించిన రూమర్స్కి బ్రేక్ పడింది. త్వరలో రానాతో చెయ్యబోయే సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.