Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ విషయంలో వెనక్కి తగ్గిన డైరెక్టర్ తేజ.. మరో మూవీ వాయిదా
విలక్షణ దర్శకులతో ఒకరైన తేజ నెక్స్ట్ 'చిత్రం' సినిమా తరహాలో చిత్రం 1.1తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. పూర్తిగా 50మంది నూతన నటీనటులతో తెరకెక్కిస్తున్న ఆ సినిమా పై తేజ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. దాదాపు 20 ఏళ్ళ అనంతరం చేస్తున్న ఈ సరికొత్త కథను ప్రస్తుతం ఉన్న జనరేషన్ ను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేశారట.
ఇక ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోగా అనుకోకుండా వాయిదా పడింది. రెండు మూడు నెలల్లోనే షూటింగ్ పనులను పూర్తి చేయాలని అనుకున్నారట. కానీ కరోనా సెకండ్ వేవ్ తో సినిమా షూటింగ్స్ ను కొనసాగించడం అంతగా సేఫ్ కాదని అన్ని పనులను ఆపేశారు. ఇక ఆ సినిమాను ఇప్పట్లో స్టార్ట్ చేసే ఛాన్స్ లేదట. ఇక చిత్రం 1.1 వాయిదా పడడంతో తేజ చేయాల్సిన తరువాత సినిమాలు కూడా మరింత ఆలస్యం కానున్నాయి.
నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ దగ్గుబాటితో ఒక సినిమాకు కమిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అతని కోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాడు. చిత్రం సీక్వెల్ అయిపోగానే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితులు వల్ల ఇప్పట్లో తేజ నుంచి సినిమా రాకపోవచ్చని సమాచారం. ఇక అభిరామ్ సినిమా ఈ ఏడాది కూడా వచ్చే అవకాశం లేదన్నమాట. సమ్మర్ అనంతరం పరిస్థితిని బట్టి మరో విధంగా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నారు.