Don't Miss!
- News SRH Vs RCB మ్యాచ్: ఉప్పల్ మార్గంలో అర్ధరాత్రి వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఆ విషయంలో వెనక్కి తగ్గిన డైరెక్టర్ తేజ.. మరో మూవీ వాయిదా
విలక్షణ దర్శకులతో ఒకరైన తేజ నెక్స్ట్ 'చిత్రం' సినిమా తరహాలో చిత్రం 1.1తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. పూర్తిగా 50మంది నూతన నటీనటులతో తెరకెక్కిస్తున్న ఆ సినిమా పై తేజ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. దాదాపు 20 ఏళ్ళ అనంతరం చేస్తున్న ఈ సరికొత్త కథను ప్రస్తుతం ఉన్న జనరేషన్ ను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేశారట.
ఇక ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోగా అనుకోకుండా వాయిదా పడింది. రెండు మూడు నెలల్లోనే షూటింగ్ పనులను పూర్తి చేయాలని అనుకున్నారట. కానీ కరోనా సెకండ్ వేవ్ తో సినిమా షూటింగ్స్ ను కొనసాగించడం అంతగా సేఫ్ కాదని అన్ని పనులను ఆపేశారు. ఇక ఆ సినిమాను ఇప్పట్లో స్టార్ట్ చేసే ఛాన్స్ లేదట. ఇక చిత్రం 1.1 వాయిదా పడడంతో తేజ చేయాల్సిన తరువాత సినిమాలు కూడా మరింత ఆలస్యం కానున్నాయి.
నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ దగ్గుబాటితో ఒక సినిమాకు కమిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అతని కోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాడు. చిత్రం సీక్వెల్ అయిపోగానే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితులు వల్ల ఇప్పట్లో తేజ నుంచి సినిమా రాకపోవచ్చని సమాచారం. ఇక అభిరామ్ సినిమా ఈ ఏడాది కూడా వచ్చే అవకాశం లేదన్నమాట. సమ్మర్ అనంతరం పరిస్థితిని బట్టి మరో విధంగా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నారు.