Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఐదుగురు హీరోయిన్లతో....వంశీ కొత్త సినిమా
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం వంశీ దర్వకత్వం వహించ బోయే ఈ కొత్త చిత్రంలో అంతా కొత్త వారినే తీసుకుంటున్నారని, ఇందులో ఒక హీరో, ఐదుగురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. పూర్ణా నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఎం.వి.రఘు సినిమాటోగ్రఫీ చేయబోతున్నారు.
1980-1990ల మధ్యలో సితార, అన్వేషణ, లేడీస్ టైలర్, ఏప్రిల్ ఒకటి లాంటి సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ టాప్ 5 దర్శకుల్లో ఒకరిగా వంశీ వెలుగొందారు. అప్పట్లో వంశీ... విశ్వనాథ్, బాపు, జంధ్యాల స్థాయి దర్శకుడిగా గుర్తింపు పొందారు. అయితే ఆ తర్వాత నుంచి వంశీ చిత్రాలకు ఆదరణ తగ్గింది. 2002లో వంశీ దర్శకత్వంలో వచ్చిన 'అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రంలో వంశీ హిట్ కొట్టాడు.
అనంతరం ఆయన దర్శకత్వం వహించిన 'దొంగ రాముడు అండ్ పార్టీ', 'కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను', 'అనుమానాస్పదం', 'గోపి గోపిక గోదారి' చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. చివరగా 2010లో వంశీ దర్శకత్వం వహించిన 'సరదాగా కాసేపు' చిత్రం యావరేజ్ కామెడీ చిత్రంగా పేరు తెచ్చుకుంది.