Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఐదుగురు హీరోయిన్లతో....వంశీ కొత్త సినిమా
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం వంశీ దర్వకత్వం వహించ బోయే ఈ కొత్త చిత్రంలో అంతా కొత్త వారినే తీసుకుంటున్నారని, ఇందులో ఒక హీరో, ఐదుగురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. పూర్ణా నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఎం.వి.రఘు సినిమాటోగ్రఫీ చేయబోతున్నారు.
1980-1990ల మధ్యలో సితార, అన్వేషణ, లేడీస్ టైలర్, ఏప్రిల్ ఒకటి లాంటి సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ టాప్ 5 దర్శకుల్లో ఒకరిగా వంశీ వెలుగొందారు. అప్పట్లో వంశీ... విశ్వనాథ్, బాపు, జంధ్యాల స్థాయి దర్శకుడిగా గుర్తింపు పొందారు. అయితే ఆ తర్వాత నుంచి వంశీ చిత్రాలకు ఆదరణ తగ్గింది. 2002లో వంశీ దర్శకత్వంలో వచ్చిన 'అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రంలో వంశీ హిట్ కొట్టాడు.
అనంతరం ఆయన దర్శకత్వం వహించిన 'దొంగ రాముడు అండ్ పార్టీ', 'కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను', 'అనుమానాస్పదం', 'గోపి గోపిక గోదారి' చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. చివరగా 2010లో వంశీ దర్శకత్వం వహించిన 'సరదాగా కాసేపు' చిత్రం యావరేజ్ కామెడీ చిత్రంగా పేరు తెచ్చుకుంది.