Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హీరోయిన్ ఆత్మ కథ రాస్తానంటున్న దర్శకుడు...
''ఓ ఆలోచన ఉంది. ఒప్పుకొంటే ఎవరైనా హీరోయిన్ ఆత్మకథ రాద్దామనుకొంటున్నా. అయితే ఆవిడ నేనడిగినదేదీ దాయకూడదు'' అన్నారు ప్రముఖ దర్శకుడు వంశీ. కథలు రాశారు... పాటలు రాశారు... ఇంకా ఏమైనా రాయాలనుకొంటున్నారా? అని మీడియా వారు ప్రశ్నిస్తే ఆయన అలా సమాధనమిచ్చారు. గోపి..గోపిక..గోదావరి హిట్టుతో మరింత ఉషారుతో అల్లరి నరేష్ హీరోగా చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు ఆయన చేస్తున్నారు.లేడీస్ టైలర్ చిత్రానికి రీమేక్ అని సమాచారం. ఇక అలాగే ఆయన రాసిన పసలపూడి కథలు చాలా ప్రాచుర్యం పొందాయి. వాటిని కూడా టీవీ సీరియల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ మధ్యన ఆయన 'అనుమానాస్పదం' చిత్రానికి రాసిన 'ప్రతి దినం నీ దర్శనం' పాట బాగా పాపులర్ అయింది.ఈ సందర్బంగానే మరో సంగతి చెప్పుకొచ్చారు...నేను రాసిన తొలిపాట.. ''సీతాకోకచిలుక కోసం 'స్తోత్రము చేయుదమూ' అనే క్రీస్తు ప్రార్థన గీతం నేను, పాలకొల్లు బాబూరావు కలిసి రాశాం. అయితే తెర మీద మా పేర్లు ఉండవు'' అన్నారు.ఇది ప్రక్కన పెడితే ఆయన ఆత్మకథ రాద్దామనుకుంటున్న హీరోయిన్ ఎవరో...