Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'బిందాస్' ఆఫర్ ఎలా వచ్చిందంటే...వీరూపోట్ల
రచయితగా కెరీర్ను మొదలుపెట్టి 'బిందాస్' తో దర్శకుడిగా మారిన వీరు పోట్ల. ఆయన 'బిందాస్' చిత్రం ఆఫర్ ఎలా వచ్చిందో చెప్పుకొచ్చారు. హాస్య నటుడు సునీల్ ద్వారా నాకు హీరో మనోజ్ పరిచయమయ్యారు. ఒక రోజు మనోజ్కు నేను కథ చెప్పటం జరిగింది. ఇంప్రెస్ అయిన మనోజ్ వెంటనే..నాకు నిర్మాత అనిల్సుంకరను పరిచయం చేసారు. ఆయన కూడా విని ఇంటిల్లిపాదీని అలరించే కథాంశం అని చేయటానికి ముందుకొచ్చారు. దాంతో..ఆలస్యం కాకుండా మా కలయికలో 'బిందాస్' చిత్రం ప్రారంభం అవ్వడం..విజయం సాధించటం అన్నీ చక చకా జరిగిపోయాయి అన్నారు.
అలాగే రచయితగా పనిచేస్తున్నప్పుడు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ దర్శకుణ్ని చేశాయంటూ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ చిత్రం తనకు ఆనందాన్ని కలగచేసిందని తొమ్మిది నెలలు తన బిడ్డను కష్టపడి ఇష్టపడి కడుపులో దాచుకున్న అమ్మ...ప్రసవం తర్వాత ఎంత ఆనందంగా, రిలాక్స్గా ఫీలవుతుందో..ఇప్పుడు నేను కూడా అదే అనుభూతిలో వున్నానని వివరించారు.వీరూ పోట్ల గతంలో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలకు కథను, సంతోషం,మనసంతా నువ్వే చిత్రానికి మూల కథను అందించారు.