Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దర్శకుడు వేణు ఊడుగులకు మాతృవియోగం.. మరోసారి వెంటాడిన విషాదం
సినీ దర్శకుడు, వేణు ఊడుగుల కుటుంబంలో విషాదం సంభవించింది. వేణు మాతృమూర్తి అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం (ఫిబ్రవరి 27న) హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఆమె పార్ధీవ దేహాన్ని బుధవారం మధ్యాహ్నం వరంగల్కు తరలించారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.
సినీ రచయితగా చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న వేణు ఊడుగుల నీది నాది ఒకే కథ చిత్రంతో సినీ దర్శకుడిగా మారారు. ఈ సినిమా రిలీజ్ కొద్ది రోజుల ముందు ఆయన తండ్రి మరణించడం విషాదంలో మునిగిపోయారు. తాజాగా తల్లిని కూడా మరణించడం మరోసారి దుఖంలో మునిగారు. విషాదానికి గురైన వేణు ఊడుగులకు పలువురు సినీ ప్రముఖులు, పాత్రికేయులు సంతాపం వ్యక్తం చేశారు.
నీది నాది ఒకే కథ చిత్రం తర్వాత వేణు ఊడుగుల ప్రస్తుతం విరాట పర్వం అనే చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. సాయిపల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్లనున్నది. ఇలాంటి శుభ సమయంలో వేణును విషాదం వెంటాడటంపై స్నేహితులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ విషాద సమయంలో వేణుకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని, తన తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నారు.