Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
దర్శకుడు వేణు ఊడుగులకు మాతృవియోగం.. మరోసారి వెంటాడిన విషాదం
సినీ దర్శకుడు, వేణు ఊడుగుల కుటుంబంలో విషాదం సంభవించింది. వేణు మాతృమూర్తి అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం (ఫిబ్రవరి 27న) హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఆమె పార్ధీవ దేహాన్ని బుధవారం మధ్యాహ్నం వరంగల్కు తరలించారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.
సినీ రచయితగా చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న వేణు ఊడుగుల నీది నాది ఒకే కథ చిత్రంతో సినీ దర్శకుడిగా మారారు. ఈ సినిమా రిలీజ్ కొద్ది రోజుల ముందు ఆయన తండ్రి మరణించడం విషాదంలో మునిగిపోయారు. తాజాగా తల్లిని కూడా మరణించడం మరోసారి దుఖంలో మునిగారు. విషాదానికి గురైన వేణు ఊడుగులకు పలువురు సినీ ప్రముఖులు, పాత్రికేయులు సంతాపం వ్యక్తం చేశారు.
నీది నాది ఒకే కథ చిత్రం తర్వాత వేణు ఊడుగుల ప్రస్తుతం విరాట పర్వం అనే చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. సాయిపల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్లనున్నది. ఇలాంటి శుభ సమయంలో వేణును విషాదం వెంటాడటంపై స్నేహితులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ విషాద సమయంలో వేణుకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని, తన తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నారు.