Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
'డర్టీ పిక్చర్'పై ముషీరాబాద్ లో ఎటాక్
సిల్క్ స్మిత జీవితం ఆధారంగా విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన డర్టీ పిక్చర్ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రదర్శన ఆపాలని ముషీరాబాద్ లోని సాయి రాజా ధియోటర్ వద్ద ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఓ ధర్నా నిర్వహించారు. చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలని వారి ప్రధాన డిమాండ్. చిత్రంలో చాలా అసభ్యకరమైన సన్నివేసాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆపాలని ధియోటర్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ వారు స్లోగన్స్ చెప్పారు.
ఈ సందర్భంగా ఎఐఎస్ ఎఫ్ జనరల్ సెక్రటరీ ఈశ్వరయ్య మాట్లాడుతూ..చిత్రంలోని అసభ్యకరమైన సన్నివేశాలు వల్ల పిల్లల మనస్సులు చెడి, వారి కెరీర్స్ పాడవుతాయని అన్నారు. అలాగే ఇలాంటి సన్నివేసాలు డైలాగ్స్ ఉన్న చిత్రానికి సెన్సార్ ఎట్లా ఇచ్చారని ధ్వజం ఎత్తారు. తక్షణం ప్రభుత్వం ఈ చిత్రాన్ని సెన్సార్ చేసిన సభ్యులపై యాక్షన్ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే తమ ఫెడరేషనే ధియోటర్స్ వద్ద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక ఈ ధర్నా జరుగుతూండగా..పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు.