Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
'డర్టీ పిక్చర్'పై ముషీరాబాద్ లో ఎటాక్
సిల్క్ స్మిత జీవితం ఆధారంగా విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన డర్టీ పిక్చర్ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రదర్శన ఆపాలని ముషీరాబాద్ లోని సాయి రాజా ధియోటర్ వద్ద ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఓ ధర్నా నిర్వహించారు. చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలని వారి ప్రధాన డిమాండ్. చిత్రంలో చాలా అసభ్యకరమైన సన్నివేసాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆపాలని ధియోటర్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ వారు స్లోగన్స్ చెప్పారు.
ఈ సందర్భంగా ఎఐఎస్ ఎఫ్ జనరల్ సెక్రటరీ ఈశ్వరయ్య మాట్లాడుతూ..చిత్రంలోని అసభ్యకరమైన సన్నివేశాలు వల్ల పిల్లల మనస్సులు చెడి, వారి కెరీర్స్ పాడవుతాయని అన్నారు. అలాగే ఇలాంటి సన్నివేసాలు డైలాగ్స్ ఉన్న చిత్రానికి సెన్సార్ ఎట్లా ఇచ్చారని ధ్వజం ఎత్తారు. తక్షణం ప్రభుత్వం ఈ చిత్రాన్ని సెన్సార్ చేసిన సభ్యులపై యాక్షన్ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే తమ ఫెడరేషనే ధియోటర్స్ వద్ద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక ఈ ధర్నా జరుగుతూండగా..పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు.